భక్తి కథలు

బసవ పురాణం- 33

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిళ్లనాయనారు
శ్రీకాళి అనే నగరంలో కుమారస్వామి అంశలో పిళ్లనాయనారు అనే భక్తుడు ఒక బ్రాహ్మణుని ఇంట పుట్టాడు. ఒకనాడు ఆ బాలుణ్ణి వెంట తీసుకొని తండ్రి నదికి స్నానానికి పోయాడు. బాలుడు గట్టున కూర్చొని వున్నాడు. అప్పుడు ఆకాశంలో శివపార్వతులు పోతూ వున్నారు. పార్వతీదేవి పిళ్లనాయనారును చూచి ముచ్చటపడి అచ్చం కుమారస్వామిలాగే ఉన్నాడు అనుకొని వచ్చి పాలిచ్చింది. తర్వాత ఓ బంగారు గినె్నతో మరికొన్ని చేతికిచ్చి వెళ్లింది. తండ్రి వచ్చి చూచి ఆశ్చర్యపోయాడు. అమ్మవారి స్తన్యాన్ని తాగి దివ్యజ్ఞాని అయిన ఆ శిశువు తిరుజ్ఞాన సంబంధుడనే పేర ప్రసిద్ధుడైనాడు.
కులోత్తుంగ చోళుణ్ణి శివభక్తుని గావించి అతని రాజ్యంలోని రెండువేలమంది జైనులను పారద్రోలాడు. తిరుమరక్కడ అనే పురంలోని బ్రహ్మేశ్వర మందిర కవాటాలు తెరిపించాడు. తిరునావలూరు అనే నగరంలో జైనులను ఓడించి పాము కరిచి మృతుడైన ఆ నగర ప్రభువుకు ప్రాణాలు ఇచ్చాడు.
తర్వాత జ్ఞాన సంబంధుడు మధురకు వచ్చాడు. అప్పుడు ఆయనతో బౌద్ధులకూ జైనులకూ శాస్తయ్రుద్ధం జరిగింది. పద్ధెనిమిది వేల జనులను జ్ఞాన సంబంధుడు ఓడించాడు. అతని ఇంటికి రాత్రి జైనులు నిప్పుపెట్టారు. కాని నిప్పు ఆయనను అంటవెరచింది. జ్ఞాన సంబంధుడు ఆ అగ్నిని మధురేశుని మీదికి తిప్పాడు. అతనికి ఉష్ణజ్వరం వచ్చింది. జ్ఞానసంబంధుడు జైనులను పిలిచి రాజుకు ఎడమవైపు నేను నయం చేస్తున్నాను, కుడివైపు మీరు నయం చేయండి అని తన భాగం తాను నయం చేశాడు. కాని జైనులు చేయలేకపోయారు.
అప్పుడు జ్ఞాన సంబంధుడు మంత్రభస్మం మళ్లీ చల్లాడు. దానితో రాజుకు జ్వరంతో బాటు గూని కూడా నయమైంది. నాటినుండి రాజు సుందర పాండ్యుడనే పేర ప్రసిద్ధుడైనాడు.
అంతటితో జైనులు ఊరుకోక అగ్నిపరీక్ష కావాలన్నారు. సరేనని జ్ఞాన సంబంధుడు ఒక కాగితంపై జైన మంత్రమూ మరొక కాగితంపై శివమంత్రమూ వ్రాయించి నిప్పులో పడవేయించాడు. జైన మంత్రం తగలబడిపోయింది. శివమంత్రం నీటిలో కమలంలాగా ప్రకాశించింది నిప్పులో. తర్వాత జైనులు బలపరీక్ష కోరారు. రెండు మంత్రలేఖలనూ కావేరీ నదిలో వేశారు. జైనమంత్రం కొట్టుకొనిపోయింది. శివమంత్రం గట్టెక్కింది. జైనులు ఓడిపోయారు. పద్ధెనిమిదివేల మంది జైనులను ఈ విధంగా తిరుజ్ఞాన సంబంధుడు జయించాడు.
నిడుమారుని కథ
నిడుమారుడు అనే రాజు జ్ఞానసంబంధుని ఉద్యమంవల్ల స్ఫూర్తి పొంది తన రాజ్యంలోని జైనమతస్థుల నందరినీ మార్పించి శివభక్తులుగా చేశాడు.
నమినంది కథ
తిరువాలూరులో నమినంది అనే మహాభక్తుడు ఉండేవాడు. శివాలయంలో నిత్యం వేయి వేయి దీపాలు పెట్టడం అతని వ్రతం. నగరంలోని జైనులు నమినందిని ఎలాగైనా తరిమివేయాలని యోచించి ఎవరూ నమినందికి దీపారాధనకై నెయ్యి ఇవ్వవద్దని శాసించారు. నమినందికి నేయి పుట్టలేదు. వ్రతభంగవౌతున్నదే అన్న దిగులుతో నమినంది ప్రాణార్పణకు సిద్ధపడ్డాడు. శివుడు నవ్వి ‘నూనెతో నాకేమి పని? నీళ్లతో వెలిగించవయ్యా’ అన్నాడు. శివాజ్ఞతో కొలనిలోని నీరు పోసి నమినంది దీపారాధన చేశాడు. కోటిదీపాలు వెలిగాయి. ఈలోగా గ్రామంలోని పశువులన్నీ చచ్చాయి. ప్రజలు భయపడి ఈ జైనుల మాటలు విని అన్యాయమైనామురా బాబూ అని దుఃఖించి నమినందిని శరణు కోరారు. నమినంది పశువులను బతికించి నగరంలో ప్రజలందరికీ శివదీక్ష ఇప్పించాడు.
సాంఖ్య తొండని కథ
చోళ మండలంలో శాంతమంగ అనే నగరంలో సాంఖ్య తొండడనే భక్తుడు ఒక బౌద్ధుని కడుపున పుట్టాడు. జైన బౌద్ధ చార్వాకములు నిర్మూలించాలని సంకేతంగా శివుణ్ణి మూడు రాళ్ళతో ముప్పొద్దులా పూజించసాగాడు. ఇలా కాదని ఒకనాడు పెద్ద రాయెత్తి ‘స్వామి! నేను విసుగెత్తాను’ అని వేయబోయాడు. శివుడు నవ్వుతూ ఆ రాయి అందుకొని వరం కోరుకోమన్నాడు. ‘ఈ ఎత్తిన రాయి పూవు రాయిగా మారి నీ శిరమును అలంకరింపజేయి తండ్రీ’ అని కోరుకున్నాడు. శివుడు అనుగ్రహించాడు. సాంఖ్యతోండడు వేదబాహ్యమైన మతములన్నీ నిర్మూలించాడు.
- ఇంకా ఉంది

- ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్