భక్తి కథలు

బసవ పురాణం- 34

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోవూరి బ్రహ్మయ్య కథ
గోవూరు బ్రహ్మయ్య అనే భక్తుడు ఒక జైనునితో వాదించి ఓడించాడు. జైనుడు ‘ఈ వాదాలెందుకు? ఈ మర్రి చెట్టును కాలిస్తే బతికిస్తావా?’ అన్నాడు. సరేనని బ్రహ్మయ్య చిరునవ్వు నవ్వాడు. జైనుడు మర్రిచెట్టును కాల్చాడు. బ్రహ్మయ్య దానిపై భస్మం చల్లి బతికించి జైనులందరినీ ఓడించాడు.
తేడర దానయ్య
పొట్ల చెరువు అనే నగరంలో ఏడు వందల జైనవసదులున్నాయి. ఇరవై వేలమంది జైనులు అందులో వున్నారు. భల్లహడనే నగర పాలకునికి జైనాచార్యుడే గురువు సింహభల్లహుని భార్య సగ్గలదేవి. ఆమె శివభక్తురాలు. గురువు తేడర దాసయ్య. భర్త చెప్పినా వినక గురువును పాదపూజకై పొట్లచెరువు పిలిపించింది.
దాసయ్యకూ జైనులకూ శాస్తవ్రాదం జరిగింది. అందులో దాసయ్య సమస్త సిద్ధాంతాలు ఖండించాడు. ‘రామనాధుడే’ కర్త వేదాల ప్రకారం ‘ఏకమేవ రుద్రో’ అనీ ‘లింగమధ్యే జగత్సర్వ’మనీ ‘లింగబాహ్యాత్పరం నాస్తి’ అనీ ఉన్నది కాబట్టి ‘ఈశ్వరుడే పరదైవం’ అని ప్రతిపాదించాడు. ‘‘ఈశ్వరుడు సర్వవ్యాపి అయితే ఈ కుండలో ఈశ్వరుడున్నాడు పట్టుకో’’ అని జైనులు ఒక కుండలో నాగుపామును పెట్టి తెచ్చారు. తేడర దాసయ్య శివనామస్మణ చేసి కుండలో చేయి పెట్టి పామును పైకి తీశాడు. సర్పం స్ఫటికలింగమై పైకి వచ్చింది. ఆ లింగాన్ని ఉత్తరేశ్వరుడనే పేర అక్కడే ప్రతిష్ఠ చేసి బల్లహునితో సహా సమస్త ప్రజలనూ శైవంలో చేర్పించాడు.
హిరియ నాచయ్య కథ
మారుడిగ అనే చోట హిరయ నాచయ్య అనే భక్తుడు ఉండేవాడు. అక్కడ పదిహేడు వందలమంది జైనులు విజృంభించి శివాలయాన్ని పడగొట్టి పూజారిని హింసించారు. అది చూచి నాచయ్య పదిహేను వేల లింగాలను బండ్లకెత్తించి పనె్నండు వేల శివభక్తులతో వచ్చి మారుడిగలో దిగి యుద్ధానికి సిద్ధమైనారు. అందులో పదముగ్గురు తేరసులు అనేవారు నాచయ్యకు వదనం చేసి తమ తలలు తామే తరుక్కొని చేత బట్టుకొని జైనులపై పడ్డారు. జైనులు చిందర వందర అయినారు. జైన వసతులన్నింటిలోనూ లింగ ప్రతిష్ఠలు చేసి తిరిగి తమ తలలు తాము యధాస్థానంలో ఉంచుకొని తమ నాయకుడైన నాచయ్య మహిమను ప్రదర్శించారు.
సోమన్నగారి కథ
హుళిగఱ అను నగరంలో సోమన్న అనే శివభక్తుడున్నాడు. త్రికాల శివస్పర్శ అతని నియమం. ఒకనాడు కన్నులు కనబడక శివస్పర్శ చేయలేక భుజింప కూర్చొని యుండగా జైనులు వచ్చి ‘రా! శివాలయానికి తీసుకుపోతాము’ అని చేయి పట్టుకొని వెళ్లి జైన విగ్రహానికి మోకరిల్లజేయించి ‘జినుడు ప్రత్యక్షమైనాడులే!’ అన్నారు నవ్వుతూ. సోమన్న రోషంతో ‘మూర్ఖులారా! వంచన చేస్తారా?’ అని బలవంతంగా కన్నులు తెరిచి చూచాడు. జిన విగ్రహం పగిలి నడుమ లింగం ఆవిర్భవించింది. జైనులు భయభీతులైనారు. లింగాన్ని సోమేశుడనే పేర నాటినుండీ అంతా పిలవసాగారు.
వైజకవ్వ కథ
పూర్వం వైజకవ్వ అనే భక్తురాలు ఉండేది. ఆమె భర్త జైనుడు. జైనులకోసం వంటలు చేయించాడు. ‘‘ఒక్క లింగ ప్రాణి అయినా తినకుండా వంటలు వ్యర్థమవుతున్నాయే’’ అని వైజకవ్వ దుఃఖిస్తూ ఉండగా శివుడు శివముని రూపంలో వచ్చి వైజకవ్వ వంట ఆరగించాడు. అది చూచి జైనులు మండిపడి వైజకవ్వ మొగుడితో చెప్పారు. అతడు ‘జైనులకు పెట్టకుండా ఒక శివుడికి పెట్టావా?’ అని కోపగించి భార్యను కొట్టసాగాడు. కానీ వైజకవ్వను శివుడు కాచాడు. ఆమెపైన పడే దెబ్బలన్నీ జైనులపైబడి జైనులు ప్రాణాలు విడవసాగారు.
‘్భర్త శైవేతరుడైనప్పుడు అతనిని విడవడమే ధర్మం’ అని భావించి వైజకవ్వ శివుణ్ణి ప్రార్థించి పురుషునిగా మారిపోయింది. వైజకనాథుడనే పేర ప్రసిద్ధుడైనాడు.
షోడ్డలదేవు బాచయ్యగారి కథ
షోడ్డలదేవు బాచరసు అనే భక్తుడు బిజ్జలుని కొలువులో ఉండేవాడు. శివరాత్రికి సౌరాష్ట్రం పోవాలని సంకల్పించి ప్రభువుతో చెప్పగా ‘చాలు చాలు నీవు పోతే ధాన్యం పని ఎవరు చూస్తారు?’ అని రాజు మందలించాడు. గత్యంతరం లేక బాచరసు ‘నేను రాలేను ప్రభూ. నీవే రా’ అని ప్రార్థించాడు. సౌరాష్ట్ర లింగం ధాన్యపుగాదెలో
ప్రత్యక్షమైంది.
- ఇంకా ఉంది

- ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్