బిజినెస్
మా టెక్స్టైల్స్ పార్కులో పెట్టుబడులు పెట్టండి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
హైదరాబాద్: వరంగల్ జిల్లాలో రెండు వేల ఎకరాల్లో ఏర్పాటుచేసే మెగా టెక్స్టైల్స్ పార్క్లో పెట్టుబడులు పెట్టేందుకు తరలి రావాలని మంత్రి కెటిఆర్.. దక్షిణ కొరియా టెక్స్టైల్స్ దిగ్గజ కంపెనీలను ఆహ్వానించారు. బుధవారం ఇక్కడ బేగంపేటలోని క్యాంప్ కార్యాలయంలో దక్షిణ కొరియా టెక్స్టైల్స్ కంపెనీల ప్రతినిధుల బృందంతో సమావేశమైన కెటిఆర్.. కాకతీయ పార్కు స్వరూపం, సౌకర్యాలను కొరియన్ కంపెనీ బృందానికి వివరించారు. మంత్రితో దక్షిణ కొరియా కంపెనీల ప్రతినిధులు కొపోతీ, కిహోక్ సుంగ్ బృందం సమావేశమైంది. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే కంపెనీలకు దేశంలోని ఏ రాష్ట్రంలో ఇవ్వలేనన్ని ప్రోత్సాహకాలు తాము ఇస్తామని తెలిపారు. టెక్స్టైల్స్ పార్క్లోని పరిశ్రమల అవసరాల కోసం ఇక్కడి కార్మికుల్లో నైపుణ్యాభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఓ శిక్షణ సంస్థను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఫలితంగా పలు అంతర్జాతీయ కంపెనీలకు తెలంగాణలో స్కిల్డ్ లేబర్ అందుబాటులో ఉంటుందని చెప్పారు. దీంతోపాటు తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక విధానం, ప్రాధాన్యతల గురించి కొరియన్ ప్రతినిధి బృందానికి మంత్రి వివరించారు. వరంగల్ పార్కులో అవసరం అయితే దక్షిణ కొరియా కంపెనీలకు ప్రత్యేకంగా కొంత స్థలాన్ని కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. కాగా, టెక్స్టైల్స్ రంగానికి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత తమను ఆకట్టుకుందన్న సుంగ్.. పార్క్కు అవసరమైన విద్యుత్, కార్మికుల లభ్యత, ప్రోత్సాహకాలను అడిగి తెలుసుకున్నారు. వరంగల్కు విమాన సౌకర్యాల గురించి మంత్రిని విదేశీ బృందం అడిగి తెలుసుకుంది. ఇందుకు మంత్రి స్పందిస్తూ అంతర్జాతీయ స్థాయి యాంకర్ ఇనె్వస్టర్లను దృష్టిలో ఉంచుకుని కేంద్రంతో మాట్లాడి త్వరలోనే వరంగల్లో ఎయిర్ స్ట్రిప్ను అందుబాటులోకి తెస్తామని అన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ ఐటి శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, టెక్స్టైల్స్ శాఖ అధికారి శైలజా రామయ్యర్తో పాటు ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు.