హైదరాబాద్

మహిళా పోలీసులకు స్కూటర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: హైదరాబాద్ పరిధిలోని మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో పనిచేస్తున్న షీ టీమ్స్‌కు హీరో మోటోకార్ప్ సంస్థ 150 స్కూటర్లను అందజేసింది. మహిళల భద్రత, అభివృద్ధిని కాంక్షిస్తూ సామాజిక బాధ్యతగా ద్విచక్రవాహనాల సంస్థ సిఐఓ అండ్ హెడ్ విజయ్ సేథి స్కూటర్లను అందజేశారని నగర పోలీస్ కమిషనర్ ఎం మహేందర్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్ కమిషనరేట్‌కు 70, సైబరాబాద్ కమిషనరేట్‌కు 50, సైబరాబాద్ కమిషనరేట్‌కు 39 స్కూటర్లు అందజేసినట్టు కమిషనర్ తెలిపారు. మహిళల భద్రత, షీ టీమ్స్ పటిష్టతను దృష్టిలో పెట్టుకుని హీరో మోటోకార్ప్ సంస్థ ఈ స్కూటర్లను అందజేయడం పట్ల నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి, సైబరాబాద్ కమిషనర్ సందీప్ శాండీల్య, రాచకొండ కమిషనర్ మహేశ్ ఎం భగవత్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హీరో మోటోకార్ప్ సంస్థకు వారు కృతజ్ఞతలు తెలిపారు.
ఘనంగా బోనాలు
కేశంపేట: బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. గురువారం కేశంపేట మండల కేంద్రంలో ఈదమ్మ బోనాల పండుగను పురస్కరించుకుని భక్తులు అమ్మవారికి బోనాలను సమర్పించి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అలాగే, కాకునూరు గ్రామంలో పోచమ్మ బోనాల పండుగ సందర్భంగా అమ్మవారికి బోనాలను సమర్పించి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేశంపేట సర్పంచ్ అమృతమ్మ, కాకునూరు సర్పంచ్ లక్ష్మమ్మ, ఉప సర్పంచ్ జంగారెడ్డిలతోపాటు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.