పశ్చిమగోదావరి

ఒకే కాన్పులో ముగ్గురు మగ శిశువులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆకివీడు: ఆకివీడులో శుక్రవారం ఒకే కాన్పులో ముగ్గురు మగ శిశువులు జన్మించారు. పాలకోడేరు మండలం మైప గ్రామానికి చెందిన దామోదం వీరవేణికి తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం ఊబలంక గ్రామానికి చెందిన వ్యవసాయ కూలి కృష్ణతో వివాహం జరిగింది. తొలి కాన్పులో వీరవేణి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డ మృతి చెందడంతో అప్పటి నుంచి గర్బం దాల్చలేదు. దీనితో ఆమె ఆకివీడులోని లక్ష్మీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంది. అనంతరం వీరవేణి గర్భం దాల్చింది. శుక్రవారం ఆమెకు పురుటినొప్పులు రావడంతో ఆసుపత్రికి తీసుకువచ్చారు. డాక్టర్ కవిత ఆపరేషన్ చేసి ముగ్గురు మగ శిశువులను బయటకుతీశారు. తల్లీపిల్లలు క్షేమంగా ఉన్నట్లు డాక్టర్ కవిత తెలిపారు. ముగ్గురు మగ శిశువులు జన్మించడంతో వీరవేణి కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది.