హైదరాబాద్

యువతిపై అత్యాచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: దిల్లీకి చెందిన ఓ యువతిని నలుగురు యువకులు తుపాకీతో బెదిరించి అత్యాచారానికి పాల్పడిన సంఘటన శుక్రవారం హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈనెల 5న హైదరాబాద్‌ను చూసేందుకు తన స్నేహితులతో కలసి 20ఏళ్ల యువతి వచ్చింది. బంజారాహిల్స్‌లోని ఓ హోటల్‌లో దిగారు. కాగా తనను తుపాకీతో బెదిరించి రూమ్ సర్వీసు బాయ్స్ తనపై అత్యాచారానికి పాల్పడ్డారని యువతి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేశారు. అరెస్టయిన వారంతా నెల్లూరు జిల్లాకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. అరెస్టయిన వారిలో వంశీకృష్ణ రెడ్డి (32) అశోక్ (26) షబ్బీర్ (45) మహేందర్‌రెడ్డి (30) ఉన్నారు. అయితే వీరిలో ఏ1 నిందితుడు వంశీ కృష్ణారెడ్డి మాత్రమే యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడని, ఇది గ్యాంగ్ రేప్ కాదని, అత్యాచారానికి పాల్పడింది..ఏ1 నిందితుడేనని బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు. నిందితులపై ఐపిసి సెక్షన్ 376, 354, 342, 506 రెడ్‌విత్ 109 కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరిలించినట్టు పోలీసులు తెలిపారు.