ఆంధ్రప్రదేశ్‌

ప్రేమోన్మాది ఘాతుకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 19: విశాఖలో ప్రేమోన్మాది చెలరేగిపోయాడు. తనను ప్రేమించలేదన్న అక్కసుతో ప్రియురాలిపై కిరోసిన్ పోసి నిప్పంటించి హతమార్చాడు. ఈ ఘటనలో ప్రియురాలి సోదరుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రియురాలిని హత్య చేసిన ప్రేమోన్మాది కొద్ది గంటల అనంతరం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. విశాఖ నగర శివారు భీమునిపట్నం మండలం టి నగరపాలెంలో శనివారం ఉదయం చోటుచేసుకున్న ఈ సంఘటన ఒక్క సారిగా ఉలిక్కిపడేలా చేసింది. ప్రేమోన్మాదంతో ప్రియురాలిని పాశవికంగా హత్య చేసిన సంఘటనలు అప్పుడప్పుడు వెలుగు చూసినప్పటికీ అత్యంత కిరాతకంగా ప్రియురాలిని కిరోసిన్ పోసి నిప్పంటి మట్టుపెట్టిన సంఘటన సంచలనం సృష్టించింది. టి నగరపాలెం ప్రాంతానికి చెందిన పొట్నూరు రూప (18) భీమిలిలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఇదే ప్రాంతానికి చెందిన పతివాడ సంతోష్ (20) గత కొంతకాలంగా రూపను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఈ విషయంలో రూప తల్లిదండ్రులు సంతోష్‌ను మందలించిన సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ సంతోష్ తీరు మారకపోవడంతో తల్లిదండ్రులు రూపను చదువు మాన్పించేశారు. దీంతో సంతోష్ మరింత ఉన్మాదిగా మారిపోయాడు. శనివారం ఉదయం రూప ఇంటికి వెళ్లి తన ప్రేమను అంగీకరించాల్సిందిగా పట్టుబట్టాడు. దీనికి రూప ససేమిరా అనడంతో సంతోష్ తనతో తెచ్చుకున్న కిరోసిన్‌ను రూపపై పోసి నిప్పంటించాడు. తీవ్రంగా కాలిన గాయాలతో రూప అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది. ఇదే సందర్భంలో అక్కడే ఉన్న రూప సోదరుడు ఉపేంద్ర సంతోష్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. అయితే అప్పటికే ఉపేంద్ర కూడా మంటల్లో చిక్కుకుని తీవ్రంగా గాయపడ్డాడు. మంటల్లో కాలుతూ రూప, ఉపేంద్ర ఆర్తనాదాలకు చుట్టుపక్కల వాళ్లు చేరుకునే లోగా సంతోష్ పరారయ్యాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన ఉపేంద్రను స్థానికులు చికిత్స నిమిత్తం విశాఖ కెజిహెచ్‌కు తరలించారు. రూపను కిరోసిన్ పోసి నిప్పంటించిన ప్రేమోన్మాది సంతోష్ విజయనగరం పారిపోయి, అక్కడ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. భీమునిపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చిత్రం..రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సంతోష్