రంగారెడ్డి

అమ్మవారికి వైభవంగా బోనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్,: మండలంలోని రాజబొల్లారం అనుబంధ గ్రామమైన అక్బర్జాపేట్‌లో ఆదివారం అమ్మవార్ల బోనాల పండుగను వైభవంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ దేశం నారాయణగౌడ్ ఆధ్వర్యంలో గురువారం తెల్లవారుఝామున దుర్గమ్మ, పోచమ్మ, మహకాంళమ్మ అమ్మవార్ల విగ్రహాలను శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించిన విషయం తెలిసిందే. కాగా ఆదివారం అమ్మవార్ల జాతర, బోనాల పండుగను నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు సంప్రదాయబద్ధంగా ముస్తాబై బోనాలతో భాజభజంత్రీల మధ్య ఊరేగింపుగా తరలివచ్చి అత్యంత భక్తిశ్రద్ధలతో అమ్మవార్లకు బోనం నైవేద్యంగా సమర్పించి తమ మొక్కులను చెల్లించుకున్నారు. స్థానిక ఎమ్మేల్యే సుధీర్‌రెడ్డి బోనాల ఉత్సవాల్లో పాల్గొని అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సర్పంచ్ నారాయణగౌడ్ ఎమ్మెల్యేను ఈ సందర్భంగా శాలువాతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భాస్కర్‌యాదవ్, ఎఎంసి చైర్మన్ సత్యనారాయణ, నాయకులు శేఖర్‌గౌడ్, మోహన్‌రెడ్డి, శైలేందర్, దర్శన్, మోనార్క్, నవీన్, పెద్దసంఖ్యలో గ్రామస్థులు పాల్గొన్నారు.