వరంగల్

భర్త చేతిలో భార్య దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సంపేట: భర్త చేతిలో భార్య దారుణ హత్యకు గురైన సంఘటన నర్సంపేట పట్టణంలోని హనుమాన్ దేవాలయం సమీపంలో సోమవారం సాయంత్రం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. పర్ష మమత, సంపత్‌ల దంపతులకు 18 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమార్తె స్వప్న, కుమారుడు సాయి ఉన్నారు. కుమారుడు ఇంటర్ చదువుతుండగా కుమార్తె పదవతరగతి చదువుతోంది. కాగా గత ఆరేళ్లుగా ఈ దంపతుల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. పలు పర్యాయాలు పోలీసుస్టేషన్‌కు సైతం ఈ దంపతులు వెళ్లి ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నట్టు తెలిసింది. రెండు నెలల క్రితం భర్త సంపత్ పెద్ద కుమారుడిని తీసుకుని వెళ్లిపోయాడు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం పాఠశాల నుండి ఇంటికి వచ్చిన స్వాతి తన తల్లి మమత రక్తపు మడుగులో కనిపించడంతో కేకలు వేసింది. ఇరుగు పొరుగు వారు వచ్చి చూసేసరికి మమత విగతజీవిగా కనిపించింది. మమత తల పక్కన రోకలి బండ ఉంది. తలను బాదడంతో తల పగిలి తీవ్రంగా రక్తస్రావం అయింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. నర్సంపేట పట్టణ రెండవ ఎస్సై నాగ్‌నాథ్ సంఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సంపేట మార్చురికి తరలించారు. మమత మధ్యాహ్నాం నిద్రిస్తున్న సమయంలో భర్త సంపత్ వచ్చి రోకలి బండతో మోదీ హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు.