కృష్ణ

ఉప రాష్టప్రతి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఉప రాష్టప్రతి ఎం వెంకయ్య నాయుడు ఈ నెల 26, 27 తేదీల్లో అమరావతి, విజయవాడలో పర్యటించబోతున్నారు. ఈసందర్భంగా సోమవారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఉప రాష్టప్రతి పర్యటనపై కలెక్టర్ బి లక్ష్మీకాంతం చర్చించారు. ప్రొటోకాల్ ప్రకారం ఉప రాష్టప్రతి పర్యటన, బస, తదితర ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలన్నారు. తాత్కాలిక కార్యక్రమం ప్రకారం ముందస్తుగా పర్యటనలో భాగంగా గన్నవరం విమానాశ్రయం చేరుకుని అక్కడి నుండి విజయవాడలోని రాష్ట్ర అతిథి గృహానికి లేదా వెలగపూడిలోని సచివాలయ ప్రాంగణానికి చేరుకోనున్నారు. అనంతరం అక్కడి నుండి బయలుదేరి తెనాలి చేరుకుని తిరిగి సాయంత్రానికి విజయవాడ చేరుకోనున్నట్లు కలెక్టర్ వివరించారు. 27న ఆత్కూరులో మెగా మెడికల్ క్యాంపు కార్యక్రమంలో ఉప రాష్టప్రతి పాల్గొననున్నారన్నారు. ఈ పర్యటనలో ఉప రాష్టప్రతికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఘనంగా స్వాగత ఏర్పాట్లను చేస్తున్నామన్నారు. రెవెన్యూ, మున్సిపల్, ప్రొటోకాల్, ఎలక్ట్రికల్, ఆర్ అండ్ బి, పోలీసు, సమాచార శాఖ, రవాణా, తదితర శాఖల వారికి కేటాయించిన విధులను సమర్ధవంతంగా నిర్వహించాలన్నారు. ఉప రాష్టప్రతి పర్యటనలో 3 హెలిప్యాడ్లు ఏర్పాటు చేయాలని, పోలీసు బ్యాండ్‌తో కూడిన జాతీయ గీతాలాపన, ఆహారం, బస, రవాణా, విద్యుత్ సరఫరా, పబ్లిక్ ఎడ్రసు ఏర్పాట్లను కూడా చేపట్టాలన్నారు. సమీక్షలో భాగంగా మున్సిపల్ కమిషనర్ జె నివాస్, ఆర్డీవో హరీష్, డిసిపి బ్రహ్మానందరెడ్డి, డిఇ ట్రాన్స్‌కో ఎ మురళీమోహన్, ఆర్ అండ్ బి డిఇ కిషోర్, తదితర అధికారులు పాల్గొన్నారు.