ప్రకాశం

నంద్యాల ఉపఎన్నికల ఫలితాలపై బెట్టింగులకు సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కాపురం: కర్నూల్ జిల్లా నంద్యాల ఉపఎన్నికల ప్రచార పోరు ముగియడంతో బెట్టింగ్ రాయుళ్లు తెరపైకి వచ్చారు. వైఎస్‌ఆర్‌సిపి గెలుస్తుందని ఎంత బెట్టింగ్‌కైనా సిద్ధమేనని, అవసరమైతే 100కు 200 రూపాయలు ఇస్తామంటూ హడావుడి చేస్తున్నారు. దీటుగా తెలుగుదేశంపార్టీ వైపు నుంచి కూడా బెట్టింగ్ రాయుళ్లు సిద్ధం అవుతున్నారు. ఇదిలాఉంటే కొందరు గెలుపులపై బెట్టింగ్‌లు పెట్టుకునేందుకు సిద్ధం కాగా, మరికొందరు మెజారిటీపై బెట్టింగ్‌లు పెట్టేందుకు సిద్ధం అవుతున్నారు. నెల్లూరు జిల్లా కోవూరు ఉపఎన్నికల సందర్భంగా ఈప్రాంతానికి చెందిన కొందరు మెజారిటీ 25వేల లోపు వస్తుందని చెప్పగా, 25వేల పైన వస్తుందని లక్షలాది రూపాయలు బెట్టింగ్‌లు పెట్టారు. దీంతో అప్పట్లో 25వేలకు లోపు మెజారిటీ రావడంతో ఈప్రాంతానికి చెందిన కొందరు లక్షల రూపాయలు దక్కించుకున్నారు. దీంతో ఇప్పుడు కూడా గెలుపుపైన, మెజారిటీ పైనా బెట్టింగ్ కట్టేందుకు ఇరుపార్టీలకు చెందిన నేతలు సిద్ధం అవుతున్నారు. ఈప్రాంతానికి చెందిన పోలీసులందరూ ఎన్నికల విధులకు వెళ్ళడంతో బెట్టింగ్ రాయుళ్ళు చెలరేగిపోతున్నారు. ఉపఎన్నికలు కావడం వలన ఈ ఎన్నిక ఇరు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారడంతో బెట్టింగ్‌రాయుళ్లు కూడా ధైర్యంచేసి బెట్టింగ్‌లు పెట్టేందుకు సిద్ధం అవుతున్నారు.