అనంతపురం

కూరగాయల వ్యాపారుల ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురంటౌన్: నగరంలోని మున్సిపల్ షాపింగ్, పోలీస్ వెల్ఫేర్ కాంప్లెక్స్‌కు వెళ్లే రహదారిపై కొత్తవూరు కూరగాయల వ్యాపారులు అమ్మకాలు సాగించటం వలన ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుండటం గుర్తించి వెంటనే వాటిని తొలగించి సెల్లార్‌లో దుకాణాలు నిర్వహించుకోవాలని కమిషనర్ పివివిఎస్ మూర్తి, ట్రాఫిక్ డిఎస్‌పి నరసింగప్పలు ఆదేశించటంతో సోమవారం మార్కెట్ వ్యాపారులు కార్పొరేషన్ కార్యాలయంలో మీకోసం కార్యక్రమంలో ఆందోళన నిర్వహించారు. సెల్లార్‌లో వ్యాపారాలు జరగనందున రోడ్డు పక్కన తోపుడుబండ్లపై కూరగాయలు అమ్ముకుంటున్నామని, తమ పొట్టగొట్టవద్దని వారు వేడుకున్నారు. అంతేగాక చిన్నపాటి వర్షానికే సెల్లార్‌లోకి నీరు వచ్చి చేరుతుండటం వలన వినియోగదారులు ఇబ్బందులుపడుతున్నారని అ న్నారు. దీనిపై కమిషనర్ మూర్తి స్పందిస్తూ నగరంలో అస్తవ్యస్తంగా మారిన ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించటానికి పోలీస్ శాఖ, కార్పొరేషన్ అధికారులు చర్యలు చేపట్టారని అన్నారు. రోడ్లపై పాదచారులు తిరగటానికి కూడా వీలులేకుండా పోతోందన్నారు. వ్యాపారులు ఇష్టారాజ్యంగా రోడ్లపై తోపుడుబండ్లు పెట్టి వ్యాపారాలు సాగిస్తుండటంపై పలు ఫిర్యాదులు ఉన్నతాధికారులకు అందుతున్నాయన్నారు. ప్రజలు నిత్యావసరాలైన కూరగాయలకు సెల్లార్‌లో ఉన్నా మార్కెట్‌కు వచ్చి కొనుగోలు చేస్తారని అన్నారు. ఎటువంటి పరిస్థితులలోను రోడ్డు పక్కన మున్సిపల్ షాపింగ్, పోలీస్ వెల్‌ఫేర్ కాంప్లెక్స్ వద్ద కూరగాయల వ్యాపారాలను అనుమతించే ప్రసక్తి లేదన్నారు. దీనితో వినాయక చవితి పండుగ ముగిసే వరకైనా అనుమతి ఇవ్వాలని కోరారు. దీనిపై డిఎస్‌పి నరసింగప్పకు కమిషనర్ మూర్తి సమాచారం అందించారు. వారు మీకోసంలో చర్చించి పండుగ దృష్ట్యా వారికి వెసలుబాటు కల్పించారు. 25వ తేదీ నాటికి రోడ్డుపై ఒక్క కూరగాయల బండి కూడా ఉండటానికి వీలులేదన్నారు. అలాగే కుళ్లిన కూరగాయలను రోడ్లపైనా, సెల్లార్‌లోకి ఎక్కడపడితే అక్కడ పారవేయకుండా గంపలలో తీసుకెళ్లి డంపర్ బిన్‌లో వేసి పరిసరాల పరిశుభ్రంగా ఉండేలా జాగ్రత్తలు పాటించాలన్నారు. వీటిని ఉల్లంఘించిన దుకాణదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తర్వాత మీకోసంలో మొత్తం 17 ఫిర్యాదులు అందాయి. అధిక శాతం డబుల్ కొళాయి కనెక్షన్లు ఉన్నట్లు బిల్లులు వచ్చాయని వాటిని రద్దు చేసి తమకు ఉపశమనం కలిగించాలని కోరారు. కార్పొరేటర్లు భూలక్ష్మి, సరళ, లక్ష్మిరెడ్డిలు పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను త్వరగా చేపట్టేలా చర్యలు చేపట్టాలని కమిషనర్‌కు విన్నవించారు.
రైతు సంక్షేమ పథకాలపై ప్రజాప్రతినిధుల ముద్ర!
ధర్మవరం: ప్రభుత్వం రైతు కోసం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలపై నాయకుల ముద్ర పడుతోంది. వారు అనుమతితోనే అధికారులు సంక్షేమ పథకాలకు రైతులను ఎంపిక చేయాల్సిన పరిస్ధితి వ్యవసాయధికారులకు ఎదురవుతోంది. ము ఖ్య నేతలు ఆదేశిస్తే రైతులు కాకున్నా సంక్షేమ పథకాలకు ఎంపిక చేయాల్సి వస్తోందని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అన్ని శాఖల్లోను ఇదే పరిస్థితి వున్నా వ్యవసాయ శాఖలో నాయకులు జోక్యం కాస్త ఎక్కువగా అవుతోందని అటు అధికారులు, సిబ్బంది ఇబ్బందిపడుతున్నట్లు ఇతర శాఖల అదికారుల వద్ద ఆవేదన చెందుతున్నట్లు తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా అధికారులపై ఒత్తిడి వున్నా ధర్మవరంలో మాత్రం నాయకుల పాత్ర మరింత అధికమైనట్లు తెలుస్తోంది. ఈ ఏడాది సైతం గత ఏడాదిలాగే ఖరీఫ్‌లో సాగు చేసే రైతులకు ఉచితంగా పంపిణీ చేయాలని వేరుశెనగ కాయల మినీ కిట్లు ప్రభుత్వం వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశిస్తూ మండలానికి 104 వేరుశెనగ 20 కిలోల బస్తాలు అందజేసింది. ఇలా ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి మండలాలకు 104 బస్తాలు చొప్పున 312 బస్తాలు వచ్చాయి. అంతే మన నేతలకన్ను వాటిపై పడటం ముఖ్య నేతకు సమాచారం అందటంతో ఆ నేత 60 బస్తాలు పంపమని వ్యవసాధికారులు ఆదేశించటంతో అవి ఆయన చెప్పిన చోటుకు చేర్చినట్లు తెలుస్తోంది. అంతటితో ఆగక మిగిలిన వాటికి టోకన్లు పంపి పార్టీ కార్యకర్తలకు అందజేయాలని చెప్పటంతో అధికారులు అలా చేయక తప్పనట్లు సమాచారం. ఇంకా మిగిలిన 40 బస్తాలకు టోకన్లు పంపటంతో బస్తాలకంటే టోకన్లు అధికంగా వుండటంతో అధికారులు దిక్కుతోచని పరిస్థితిలో వున్నట్లు తెలుస్తోంది. ఇలా తీసుకున్న వాటికి పంట పెట్టని భూముల పాసుబుక్కులు తీసుకెళ్లి అధికారులుకు ఇచ్చి నమోదు చేయించటంతో అధికారులు చేసేది లేక నమోదు చేయాల్సి వచ్చినట్లు సిబ్బంది ద్వారానే తెలుస్తోంది. అలాగే భూ పోషక విలువలను పెంపొందించుకునేందుకు రైతులకు ప్రభుత్వం అందిస్తున్న జింక్, బోరాన్ తదితర ఎరువులు సైతం అర్హులకంటే అనర్హుల పాలవుతున్నట్లు తెలుస్తోంది. వీటిని మా అనుమతి లేనిదే పంచకూడదంటు ఇటీవలె ఓ అధికార పార్టీ నాయకుడు వ్యవసాయ అధికారి కార్యాలయంలోనే ఎంపిఈఓపై పరుష పదజాలంతో మాట్లాడిన విషయం తెలిసిందే. అంతేకాక గత ఏడాది 50శాతం రాయితీ ధరతో అందించిన న్యూట్రిషన్ ఎరువులు నేతలు తీసుకుని ఇంతవరకు డబ్బులు చెల్లించకపోవడంతో అధికారులు ఆ నేతలను డబ్బులు అడగలేక సతమతమవుతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ప్రభుత్వం రైతుల కోసం ప్రవేశపెడుతున్న రాయితీ పథకాలు, ఉచితంగా పంపిణీ చేసే ఎరువులు ఇతరత్రాలు పంటలు సాగు చేసే రైతులకంటే అధికారంలో వుండే పార్టీల నాయకులే తీసుకుని ప్రభుత్వ లక్ష్యానికి గండి కొడుతున్నట్లు వ్యవసాయ అధికారులు, అర్హులైన రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతులకు అందించే పథకాలను అర్హులైన రైతులకు అందిస్తే ప్రభుత్వ లక్ష్యం నెరవేరడంతోపాటు రైతులు అభివృద్ధి కూడా చెందుతారని అధికారులు, రైతులు పేర్కొంటున్నారు.
డిజె లాకర్‌ను ప్రతి ఒక్కరు ప్రారంభించాలి
అనంతపురం సిటీ: విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, నిరుద్యోగులు అన్ని వర్గాల ప్రజలు వెంటనే డిజె లాకర్‌ను ప్రారంభించాలని కలెక్టర్ జి.వీరపాండ్యన్ పిలుపునిచ్చారు. సోమవారం డిజె లాకర్, ఇసుక విధానం, బాల్య వివాహాలు, చదువు-ఎదుగు తదితర అంశాలపై ఆర్‌డిఓలు, తహశీల్దార్లు, ఎంఈఓల, హెచ్‌ఎంలు, అన్ని మండలాధికారులతో కలెక్టర్ వీడియో కాన్పరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డిజె లాకర్‌ను డిఐజిఐఎల్‌ఓసికెఈఆర్.జిఓవి.ఇన్ వెబ్‌సైట్ ద్వారా సులభంగా ప్రారంభించవచ్చునని తెలిపారు. ఇందులో అన్ని రకాల డాక్యుమెంట్స్, సర్ట్ఫికెట్లును భద్రపరచుకోవచ్చునన్నారు. ఇవి అత్యంత సురక్షితమని తెలిపారు. ప్రభుత్వం నుండి వచ్చే సర్ట్ఫికెట్స్ నేరుగా ఈ డిజిటల్ లాకర్‌లోకి వస్తాయన్నారు. ఒరిజినల్ సర్ట్ఫికెట్లు మీ దగ్గరే ఉంటాయని, కేవలం స్కాన్ చేసిన కాపీలు మాత్రమే డిజే లాకర్‌లో ఉంటాయని, దీనిపై ఎలాంటి అపోహలు వద్దని తెలిపారు. భవిష్యత్తులో ఉద్యోగ నియామకాల్లో డిజె లాకర్ ద్వారానే అభ్యర్థుల సర్ట్ఫికెట్లును పరిశీలిస్తామని తెలిపారు. జిల్లాలో 71 ఇసుక రీచ్‌ల ద్వారా 8.30 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. ఈ రీచ్‌ల ద్వారా ఇసుక ఉచితమని, కేవలం రవాణా చార్జీలను మాత్రమే తెలిపారు. జిల్లాలో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయని, వీటిని అరికట్టడంలో పోలీసులు, రెవిన్యూ, ఐసిడిఎస్, విద్యా శాఖల సమన్వయంతో పనిచేసి బాల్య వివాహాలను అరికట్టాలని ఆదేశించారు. బాల్య వివాహాలకు దారితీసే సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని తెలిపారు. జిల్లాలో పదవ తరగతి ఉత్తీర్ణతకు ఉపాధ్యాయులు ప్రమాణాలతో కూడిన విద్యను విద్యార్థులకు అందించాలన్నారు. ఇందుకుగాను 10వ తరగతి బోధిస్తున్న ఉపాధ్యాయులందరికీ గ్రేడింగ్ ఇస్తూ వెంటనే నివేదికను ఇవ్వాలని ఎంఇఓలను ఆదేశించారు. చదువు-ఎదుగు, బుక్ రీడింగ్ వల్ల విద్యార్థుల్లో సృజనాత్మకను వెలికితీయవచ్చునని తెలిపారు. బహుమతుల ద్వారా ప్రతి గురువారం విద్యార్థులను ప్రోత్సహించాలన్నారు. ఈ కార్యక్రమంలో జెసి రమామణి, జెసి-2 సయ్యద్ ఖాజామొహిద్దీన్, డిఐఓ దీక్షితులు, డిఇఓ లక్ష్మినారాయణ, ఆర్‌డిఓలు, తహశీల్దార్లు, ఎంఇఓలు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అనంత కరవుకు ప్రభుత్వాలదే బాధ్యత
హిందూపురం:అనంతలో వరస కరవులకు ప్రభుత్వాలదే బాధ్యతని సకాలంలో ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడంతోనే జిల్లాలో వరుస కరవులు వస్తున్నాయని సిపిఎం పార్టీ రాయలసీమ సబ్ కన్వీనర్ ఓబుళ ఆరోపించారు. సోమవారం పట్టణంలోని ఐఎంఏ హాలులో డివిజన్ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఓబుళతో పాటు జెవివి జిల్లా నాయకులు డాక్టర్ ఇటి రామ్తూర్తి, రాజశేఖర్, రైతు సంఘం నాయకులు సిద్దారెడ్డి, వినోద్‌కుమార్, సిఐటియు డివిజన్ కార్యదర్శి జడ్పీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ, ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే అనంతలో వరుస కరవులు నెలకొన్నాయన్నారు. అభివృద్ధి చెందిన దేశాలలో 90 శాతం రాయితీతో రైతులకు అన్ని వసతులు కల్పిస్తున్నారని, అయితే దేశంలో ప్రభుత్వాలు కార్పొరేట్ కంపెనీలతో కుమ్మక్కై వారికి ఇస్తున్న రాయితీలు సైతం రైతులకు ఇవ్వడం లేదన్నారు. దీంతో వ్యవసాయం సంక్షోభంలో పడిందన్నారు. గత సంవత్సరం జిల్లా లో 6.50 లక్షల హెక్టార్లలో రైతులు వేరుశెనగ పంటను వేశారని, దీనికి వారు రూ.48 కోట్లు వెచ్చించారన్నారు. అయితే ప్రభుత్వం ఇన్‌పుట్ సబ్సిడీ కింద రూ.1000 కోట్లు ఇచ్చి ప్రపంచంలో ఎవరూ ఇవ్వలేనంత ఇచ్చానని చెప్పడం ముఖ్యమంత్రి చెప్పడం హాస్యాస్పందంగా ఉందన్నారు. ని యోజకవర్గంలో నీటి ఎద్దడి తీవ్రం గా ఉందని, గ్రామీణాభివృద్ధి మంత్రి లోకేష్ ఫోన్‌కొట్టు నీళ్లు పట్టు అంటున్నారని, అయితే నీటి సమస్య మాత్రం పరిష్కారం కాలేదన్నారు. బహుశా స్థానిక ఎమ్మెల్యే బాలయ్య ఫోన్ కొడితే నీళ్ళు వస్తాయా అని ఎద్దెవా చేశారు. జిల్లాలో రూ.92.5 కోట్ల ఉపా ధి బిల్లులు బకాయిలు ఉన్నాయని, బకాయిలు ఇవ్వక పనులు చూపించకపోవడంతో జిల్లాలో వలసలు ఎక్కువయ్యాయన్నారు. ఉపాధి బిల్లులు వెంటనే మంజూరు చేయాలని, ప్రజా సమస్యలను పరిష్కరించాలని అన్ని మండల కార్యాలయాల ముందు రైతులతో కలసి పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి ఈ సమావేశంలో తీర్మానించారు. నాయకులు నారాయణస్వామి, నరసింహప్ప, రాజప్ప, సదాశివరెడ్డి, వేంకటేష్, లక్ష్మీనారాయణ, ఆదెప్ప, రాము పాల్గొన్నారు.
ముగిసిన రాష్టస్థ్రాయి టెన్నికాయిట్ పోటీలు
కదిరి: పట్టణ శివార్లలోని కుటాగుళ్ల సమీపంలో వున్న బ్లూమూన్ ఇంటర్నేషనల్ పాఠశాలలో మూడు రోజులపాటు జరిగిన అంతర్ జిల్లాల రాష్టస్థ్రాయి టెన్నీకాయిట్ పోటీలు సో మవారం ముగిశాయి. ఈ సందర్భంగా జాతీయ జట్టుకు బాలికల విభాగంలో సుమతి (చిత్తూరు), హేమమాధురి (పశ్చిమ గోదావరి), వౌనిక (విజయనగరం), గంగోత్రి (అనంతపురం), శ్రావణి (విజయనగరం), నాగలక్ష్మి (విశాఖపట్నం), ఝాన్సీ (శ్రీకాకుళం), సునంద (కృ ష్ణా) జిల్లాలకు చెందిన క్రీడాకారులు ఎంపికయ్యారు. బాలుర విభాగంలో యశ్వంత్ కుమార్, సందీప్ కు మార్ (విజయనగరం), రవికుమార్, అజంతుల్లా (కృష్ణా), నివాస్‌పాత్రో (శ్రీకాకుళం), త్రిమూర్తులు, రాజు (తూర్పు గోదావరి), లోకేష్ (నెల్లూరు) క్రీడాకారులు రాష్టస్థ్రాయి పోటీల్లో జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. కాగా వ్యక్తిగత బాలికల వి భాగంలో సుమతి (చిత్తూరు), బాలుర విభాగంలో సందీప్‌కుమార్ (విజయనగరం) మొదటి స్థానంలో నిలిచి బహుమతులు అందుకున్నారు. బ హుమతుల ప్రధానోత్సవం పాఠశాల ఇన్‌చార్జ్ రమణ అధ్యక్షతన జరగగా, ముఖ్య అతిథిగా బ్లూమూన్ విద్యాసంస్థ అధినేత శివశంకర్ హాజరై మాట్లాడారు. రాష్ట్రం తరపున జాతీయ జట్టుకు ఎంపికైన క్రీడాకారులు జాతీయ స్థాయిలో రా ణించాలన్నారు. భవిష్యత్తులో జా తీ య స్థాయి పోటీలు నిర్వహించడానికి అవకాశమొస్తే తప్పకుండా నిర్వహిస్తామన్నారు. జాతీయ జట్టుకు ఎం పికైనా క్రీడాకారులకు అవసరమైన యూ నిఫాంను తామే అందిస్తామని శివశంకర్ హామీ ఇచ్చారు. రాష్ట్ర టెన్నికాయి ట్ కార్యదర్శి ముస్త్ఫాఅలీ ఖాన్ మా ట్లాడుతూ రాష్ట్ర విభజన అనంతరం జిల్లాలో రాష్టస్థ్రాయి టోర్నమెంట్ నిర్వహించిన బ్లూమూన్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ అభినందించారు. బాపూజీ, తాత య్య, రంగస్వామి, పాఠశాల హె చ్‌ఎం సురేంద్రరెడ్డి, ప్రిన్సిపాళ్లు శ్రీనివాసులు, ప్యారీ సల్మా, పిఈటిలు రామాంజులురెడ్డి, అశోక్ పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికై కృషి
* ఎంపి జెసి దివాకర్‌రెడ్డి
యాడికి:వరుణదేవుని కటాక్షం లేక రైతన్న పంట పండించకపోతే ఆ ప్రభావం తగిలిన రంగాలపై పడుతుందని, ఓ ప్రజా ప్రతినిధిగా తాను ప్రజల క్షేమ సమాచారాలు తెలసుకునేందుకే వచ్చానని, ఏమైనా సమస్యలుంటే అడగాలని అనంతపురం ఎంపి జెసి దివాకర్‌రెడ్డి సోమవారం మండలంలోని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. సోమవారం ఎంపి జెసి దివాకర్‌రెడ్డి మండలంలో సుడిగాలి పర్యటన చేశారు. సిలక్షుంపల్లి, చందన, రాయలచెరువు, యాడికి గ్రామాలను సందర్శించి ప్రజల సమస్యలను అడిగితెలుసుకున్నారు. ఈ సందర్భంగా లక్షుంపల్లి ప్రజలు రైతులకు నీరు నిలిచి ఉండడానికై చెక్‌డ్యాం నిర్మించాలని కోరారు. అలాగే విద్యుత్ సబ్‌స్టేషన్ ఏర్పాటు చేయాలని, రోడ్డు నిర్మాణం, దయ్యాలమడుగు గ్రామస్తులు బస్ షెల్టర్ నిర్మించాలని కోరారు. వెంటనే దివాకర్‌రెడ్డి బస్ షెల్టర్, చెక్‌డ్యాం, విద్యుత్ సబ్ స్టేషన్‌కు అధికారులతో మాట్లాడి వెంటనే మంజూరు చేయిస్తామన్నారు. చెన్నకేశవస్వామి ఆలయంలో స్వామివారి భూములపై వివరించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు వారికి పూలమాలలు వేసి శాలువలతో సత్కరించారు. గృహనిర్మాణ పత్రాల లబ్ధిదారులకు ఎంపి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో తహసీల్దార్ బ్రహ్మయ్య, ఇన్‌చార్జి ఎంపిడిఓ, ఇఒఆర్డి నాగమ్మ, హౌసింగ్ ఎఇ రంగనాయకులు, ఎఓ వసుంధర, అంగన్‌వాడి సూపర్‌వైజర్ పార్వతమ్మ, నాయకులు మాజీ ఎంపిపి యాడికి బాబు తదితరులు పాల్గొన్నారు.
24న మట్టి వినాయక విగ్రహాల పంపిణీ
* హిందూ ధర్మ ప్రచార మండలి జిల్లా అధ్యక్షులు శ్రీపాద వేణు
అనంతపురం కల్చరల్: వినాయక చవితి పండుగను పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక విగ్రహాల ఏర్పాటును ప్రోత్సహించేందుకు ఈ నెల 24న మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు హిందూ ధర్మ ప్రచార మండలి జిల్లా అధ్యక్షులు శ్రీపాద వేణు సోమవారం తెలిపారు. 2500 మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేయనున్నట్లు, భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని మట్టి ప్రతిమలనే పూజించాలని ఆయన కోరారు. 24న ఉదయం 9 గం.ల నుండి సరోజిని రోడ్డులోని తమ షాపు ముందు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
హెచ్‌ఎల్‌సిలో పూడిక తొలగించాలి
ఉరవకొండ:తుంగభద్ర ఎగువ కాలవలోని హెచ్‌ఎల్‌సి కాలవ పూడిక, కంపచెట్లతో నిండిపోయింది. గత నాలుగు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా హెచ్‌ఎల్‌సి కాలవ గట్లు కోతకు గురికావడంతో, ఒండ్రు మట్టంతా కాలవలో నిండిపోయింది. దీంతోపాటు కంపచెట్లు, గడ్డితో నిండిపోయింది. జిల్లా తాగునీటి అవసరాల కోసం తుంగభద్ర జలాశయం నుండి రెండు రోజుల్లో నీటిని విడుదల చేస్తున్నారు. కాలవలో పూడిక, మట్టితో నిండిపోవడంతో నీటి ప్రవాహానికి అడ్డుపడుతుందని ప్రజలు వాపోతున్నారు.
అలంకార ప్రాయంగా గుత్తి జిఆర్‌పి పోలీసుస్టేషన్
గుత్తి:గుంతకల్లు డివిజన్ పరిధిలోని గుత్తి రైల్వే స్టేషన్‌లో గల జిఆర్‌పి పోలీసు స్టేషన్ ఆలంకార ప్రాయంగా మారిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుస్టేషన్‌లో అవసరమైన స్థాయిలో సిబ్బందిని నియమించడంలో ఉన్నతాధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తుండడం వల్ల ప్రస్తుతం ముగ్గురు కానిస్టేబుళ్లు మాత్రమే ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. మిగిలిన సిబ్బంది తాత్కాలిక డిఓలతో విధులు నిర్వహిస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. దీంతో జిఆర్‌పి స్టేషన్ పరిధిలో గుత్తి, తిమ్మనచెర్ల మద్య, తాడిపత్రి, కోమలి రైల్వే స్టేషన్ల మద్య విధులను నిర్వహించడంతో పాటు రాత్రి సమయాల్లో రైళ్లలో బందోబస్తు చర్యల చేపట్టడం తలకు మించిన భారంగా తయారైందని వారు వాపోతున్నారు. గత 10 సంవత్సరాల క్రితం గుత్తి జిఆర్‌పి స్టేషన్‌లో శాశ్వత ప్రతిపాదికన ఒక ఎస్‌ఐ, మరోక ఎఎస్‌ఐతోపాటు నలుగురు హెడ్ కానిస్టేబుళ్లు, మరో 10 మందికి పైగా పోలీసు కానిస్టేబుళ్లు విధులు నిర్వహిస్తుండేవారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా ఎకానమి పేరుతో రైల్వే శాఖ ఉన్నతాధికారులు జిఆర్‌పి పోలీసు స్టేషన్‌లో సిబ్బందిని తగ్గించుకుంటూ వస్తోంది. దీంతో ప్రస్తుతం గుత్తి జిఆర్‌పి పోలీసు స్టేషన్‌లో కేవలం ముగ్గురు కానిస్టేబుళ్లు మాత్రమే నిత్యం అందుబాటులో ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు. వీరిపై పర్యవేక్షణ నిమిత్తం కదిరి, కడప జిఆర్‌పి పోలీసుస్టేషన్ల నుండి ప్రతి 15 రోజులకు ఒక ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు ఇక్కడ విధులు నిర్వహిస్తుంటారు. 15 రోజుల అనంతరం తిరిగివారు తమ స్వంత పోలీస్ స్టేషన్లకు తిరిగివెళుతుంటారు. ఈ 15 రోజుల్లో జరిగిన నేరాలను నమోదు చేసిన సంబంధిత అధికారులు 15 రోజుల అనంతరం తిరిగి వారిపోలీస్ స్టేషన్లకు వెల్లిపోవడంతో కేసులకు సంబంధించిన దర్యాప్తు కొనసాగించడం స్థానిక సిబ్బందికి కత్తిమీద సాముగా మారింది. గుత్తి జిఆర్‌పి పోలీస్ స్టేషన్‌లో పూర్తిస్థాయిలో సిబ్బందిని నియమించడం ద్వారా రైళ్లలో చోరీలను నియంత్రించడంతోపాటు నేరాల నియంత్రణకు పకడ్భంది అవకాశం ఏర్పడుతుంది. దీంతో వైభవాన్ని కోల్పోయిన గుత్తి జిఆర్‌పి పోలీస్ స్టేషన్ తిరిగి పూర్వ వైభవాన్ని పొందే అవకాశం ఉందని వారు అభిప్రాయ పడుతున్నారు. ఉన్నతాధికారుల చర్యల కారణంగా తాము నెలలో కేవలం 2, 3 రోజులు మాత్రమే విశ్రాంతి తీసుకోగలుగుతున్నామని, పని ఒత్తిడితో అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నామని సిబ్బంది వాపోయారు. ఇప్పటికైనా రైల్వే శాఖ ఉన్నతాధికారులు జిఆర్‌పి పోలీస్ స్టేషన్‌కు పూర్తిస్థాయిలో పర్యవేక్షణ అధికారిని నియమించాలని వారు కోరుతున్నారు.
రాజు రోడ్డులో కాలువ పూడిక పనుల పరిశీలన
అనంతపురంటౌన్: నగరంలోని రాజు రోడ్డులో కాలువ పూడికతీత పనులను సోమవారం కమిషనర్ పివివిఎస్ మూర్తి పరిశీలించారు. రాజు రోడ్డులో కాలువలు పూర్తిగా బండలతో కప్పి వేయటంతో చెత్త చెదారాలతో నిండిపోయి మురుగు నీరు రోడ్లపైకి చేరుతుండటంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనితో కమిషనర్ దగ్గరుండి పూడికతీత పనులు చేయించారు. సిబ్బంది అలసత్వం, నిర్లక్ష్యంపై కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత ఎస్‌ఎస్ ట్యాంక్‌లో నిల్వ చేసిన మొక్కలను పరిశీలించారు. ప్రతి డివిజన్‌లో మొక్కలు నాటేందుకు గుంతలు తీయించాలని ఆదేశించారు. నాటిన మొక్కలను పరిరక్షించటానికి ట్రీగార్డులు అమర్చాలని సూచించారు. తర్వాత కోవూరు నగర్‌లో కాలువలను శుభ్రం చేయటాన్ని పరిశీలించారు. మొక్కలు నాటే కార్యక్రమంలో పొరపాట్లు జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని ఎన్విరాన్‌మెంట్ డిఇఇ సురేంద్రనాథ్, ఎ.ఇ హేమచందర్‌ను ఆదేశించారు.
ఎడిసిసి బ్యాంకు ఉద్యోగుల ధర్నా
అనంతపురం కల్చరల్: సెక్షన్ 51 విచారణను వెంటనే ఆపాలంటూ ఎడిసిసి బ్యాంకు ఉద్యోగులు బ్యాంకు ముందు ధర్నా నిర్వహించారు. జిల్లా బ్యాంకు ఉద్యోగుల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఎడిసిసి బ్యాంకు ముందు సోమవారం జరిగిన ధర్నాలో ఎపిసిసిబిఇఎ రాష్ట్ర నాయకులు సుఖదేవబాబు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. నిబంధనలకు విరుద్ధంగా, దురుద్ద్యేశంతో సెక్షన్ 51 విచారణకు ఆదేశించడం తగదన్నారు. వెంటనే విచారణ నిలిపివేయాలన్నారు.
శ్రీకృష్ణదేవరాయల వైభవంపై జాతీయ సదస్సు
అనంతపురం అర్బన్: విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన వారిలో సుప్రసిద్ధ శ్రీకృష్ణదేవరాయల వైభవం మరింతమందికి తెలియజేయడానికి సెప్టెంబర్ 7, 8న గోరంట్లలో జాతీయస్థాయి సదస్సును ఏర్పాటుచేసినట్లు సదస్సు సంచాలకులు మైనుస్వామి తెలిపారు. సోమవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో అనేక మంది కవులతో పోటీపడి రచనలు చేసి తనకు తెలుగు భాషపై ఉన్న మమకారం తెలియజేయటం జరిగిందన్నారు. సమావేశంలో ప్రొఫెసర్ విజయ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
పివిఆర్‌కె ప్రసాద్ మృతికి నివాళులు
అనంతపురం కల్చరల్: తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఈవో, హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ వ్యవస్థాపకులు పివిఆర్‌కె. ప్రసాద్ మృతికి సమరసతా సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. సోమవారం కోర్టు రోడ్‌లోని శివకృపలో జరిగిన సంతాప సభలో ఎస్‌ఎస్‌ఎఫ్ జిల్లా ధర్మ ప్రచారక్ నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ 1978 నుండి 1982 వరకు టిటిడి ఈవోగా భక్తుల సౌకర్యాలకు పెద్ద పీట వేస్తూ పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టినట్లు పేర్కొన్నారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు, దాస సాహిత్య ప్రాజెక్టు, ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టులు వీరి హయాంలోనే రూపుదిద్దుకున్నాయన్నారు. పదవీ విరమణ అనంతరం సనాతన భారతీయ ధర్మ పరిరక్షణే ధ్యేయంగా హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహించారన్నారు. ధర్మ పరిరక్షణకు టిటిడి, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో సమరసతా సేవా ఫౌండేషన్ ఏర్పాటులో ఆయన చేసిన కృషి మరువలేనివన్నారు.ఈ కార్యక్రమంలో కార్యాలయ ప్రముఖ్ వజ్రం గంగరాజు, ధర్మ ప్రచారక్‌లు గురురాజారావు, నాగరాజు, హరి తదితరులు పాల్గొన్నారు.