ఆంధ్రప్రదేశ్
త్యాగధనుడు ప్రకాశం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
విజయవాడ: దేశ స్వాతంత్య్రానికి, ఆంధ్ర రాష్ట్ర సాధనకు సర్వం త్యాగం చేసిన వ్యక్తి టంగుటూరి ప్రకాశం పంతులని, ఆయన స్ఫూర్తి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆదర్శం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 146వ జయంతిని పురస్కరించుకుని బుధవారం స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రం సమీపంలోని రైల్వే పార్శిల్ ఆఫీసు సర్కిల్లో గల ప్రకాశం విగ్రహానికి ముఖ్యమంత్రి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ కొంతమంది మహానుభావులు చరిత్రలో నిలిచిపోతారని, అలాంటి వ్యక్తులలో టంగుటూరి ప్రకాశం పంతులు ఒకరని తెలిపారు. తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవడమే కాకుండా స్వాతంత్య్ర సాధనలో ఆనాటి బ్రిటీషు వారి గుండెల్లో నిద్రించారన్నారు. ఒంగోలు సమీపంలోని వినోదరాయునిపాలెంలో 1872 ఆగస్టు 23న గోపాలకృష్ణ, సుబ్బమ్మ దంపతులకు జన్మించారన్నారు. స్వాతంత్య్రోద్యమ కాలంలో సైమన్ గో బ్యాక్ నినాదంతో బ్రిటీషువారికి ఎదురొడ్డి నిలిచిన ఆయన ధైర్యసాహసాలకు మెచ్చిన ఆంధ్రప్రజలు ఆంధ్రకేసరి బిరుదును ఇచ్చి గౌరవించారన్నారు. భారతదేశానికి స్వాతంత్య్రం కోసం జరిగిన ఉద్యమంలో బ్రిటీషు వారికి ఎదురొడ్డిన ధీశాలి, భయం లేని వ్యక్తి అని అలాంటి వ్యక్తుల అడుగుజాడలలో నేటితరం ముందుకు వెళ్లవలసిన అవసరం వుందన్నారు. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా రాష్ట్ర అభివృద్ధికి కృషి చేశారన్నారు. ముఖ్యమంత్రిగా జమీందారీ వ్యవస్థను రూపుమాపేందుకు, పేదలకు సంక్షేమ పథకాలు, సాగునీటికోసం కృషి చేశారని తెలిపారు. నేడు హైదరాబాదు నుంచి అమరావతి రాజధానికి నెత్తిన రూ.16,000 కోట్లు లోటు బడ్జెట్, అప్పు పెట్టుకుని వచ్చామన్నారు. విద్యార్థుల జీవితాలు బంగారు భవిష్యత్తుగా మార్చడం కోసం ప్రకాశం పంతులును స్ఫూర్తిగా తీసుకుని పనిచేస్తానని ముఖ్యమంత్రి తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పుడు రాష్ట్రంలో కాలేజీలు గాని, పట్టణీకరణ గాని, పారిశ్రామికీకరణ గాని జరగలేదన్నారు. విభజనానంతరం మూడు సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో కాలేజీల స్థాపనలో పారిశ్రామికీకరణలో చెప్పుకోదగ్గ అభివృద్ధిని సాధించామన్నారు. గోదావరి జలాలను కృష్ణాడెల్టాకు తీసుకురావడానికి పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిర్మించామన్నారు. లేకుంటే కృష్ణా డెల్టా ఎడారిగా మారేదని, అలాంటి పరిస్థితి నుంచి కృష్ణా డెల్టాను కాపాడామన్నారు. గోదావరి జలాలను నెల్లూరులోని పెన్నానదికి అనుసంధానం చేసి కరవు ప్రాంతాన్ని ఆదుకుంటామన్నారు. ప్రపంచంలో అమరావతి రాజధానిని ప్రథమస్థానానికి తీసుకువెళ్లడానికి కృషి చేస్తామన్నారు. అమరావతి రాజధానిలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన యూనివర్శిటీలను, కాలేజీలను తీసుకువచ్చి రాష్ట్రాన్ని నాలెడ్జి హబ్గా తయారు చేస్తామన్నారు. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరికీ నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించి ఉద్యోగాలు పొందేవిధంగా చేయూత అందిస్తామన్నారు. రాష్ట్రంలో సంక్షేమానికి, అభివృద్ధికి, సాగునీటికి, వ్యవసాయానికి , ఎయిర్పోర్టుల నిర్మాణానికి పెద్ద పీట వేస్తున్నామన్నారు.