జాతీయ వార్తలు
మణిపూర్ సరిహద్దు జిల్లాల్లో గస్తీ పెంపు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఇంఫాల్, సెప్టెంబర్ 13: మయన్మార్నుంచి పారిపోతున్న రోహింగ్యా ముస్లింలు సరిహద్దులను అక్రమంగా దాటి మణిపూర్లో ప్రవేశించవచ్చన్న భయాల కారణంగా మయన్మార్ సరిహద్దులకు ఆనుకుని ఉన్న రాష్ట్రంల్లోని పోలీసులను పూర్తిగా అప్రమత్తంగా చేశారు. గత మూడు రోజులుగా ఈ జిల్లాల్లో గస్తీని ముమ్మరం చేశామని, అక్రమంగా వలసవచ్చిన వారినెవరినీ గుర్తించలేదని, అరెస్టు చేయలేదని వారు చెప్పారు. సరిహద్దు పట్టణమైన మోరేకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని వారు చెప్పారు. సరిహద్దులకు ఆవలివైపున ఉండే వ్యాపార కేంద్రమైన టామునుంచి జనం తగిన గుర్తింపు పత్రాలతో మోరే పట్టణాన్ని సందర్శించవచ్చు కానీ సాయంత్రం 4 గంటలకల్లా తిరిగి వెళ్లిపోవలసి ఉంటుంది. పెద్ద ఎత్తున రోహిగ్యాలు రాష్ట్రంలోకి రాకుండా చూడడానికి 364 కి.మీ. పొడవున్న భారత్-మయన్మార్ సరిహద్దు పొడవునా భద్రతను పటిష్ఠం చేయాలని ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ ఆదేశించినట్లు పోలీసులు తెలిపారు.