తెలంగాణ

ఆరుగురు డిఎస్పీలకు పదోన్నతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 23: తెలంగాణలో ఐదుగురు డిఎస్పీలకు పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏఆర్ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్‌లో డిఎస్పీగా పనిచేస్తున్న ఎన్‌వి కిషన్‌రావుకు అదనపు ఎస్పీగా ప్రమోషన్ ఇస్తూ, ఎన్‌సి ఇంటెలిజెన్స్ అధికారిగా నియమించారు. సిఆర్‌ఏ డిఎస్పీగా పనిచేస్తున్న సయ్యద్ అన్వర్ హుస్సేన్‌ను పదోన్నతిపై నిజామాబాద్ అదనపు డిసిపి ఏఆర్‌గా నియమించారు. అదేవిధంగా కరీంనగర్ ఓఎస్‌డిగా పనిచేస్తున్న పి అమరేందర్‌రెడ్డికి కరీంనగర్ సిటీ సిఏఆర్ అదనపు ఎఏస్పీగా బాధ్యతలు అప్పగించారు. తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీలో పనిచేస్తున్న పి శ్రీరామమూర్తిని ఆర్‌బివిఆర్‌ఆర్ అదనపు ఎస్పీగా పదోన్నతి కల్పించారు. నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ డిఏఆర్‌గా పనిచేస్తున్న ఆర్ వెంకటేశ్వర్లును రాచకొండ అదనపు ఎస్పీ సిఎస్‌డబ్ల్యుగా పదోన్నతి కల్పించారు. టిఎస్‌పిఏలో పనిచేస్తున్న ఎం మాణిక్ రాజును సైబరాబాద్ అదనపు డిసిపి, సిఎస్‌డబ్ల్యుగా పదోన్నతి కల్పించారు.