తెలంగాణ

జగన్ అంటే టీడీపీకి వణుకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 20: నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి, నేడు వైఎస్ జగన్ అంటే టిడిపికి వెన్నులో వణుకు పుడుతోందని వైఎస్‌ఆర్‌సిపి సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు నాయుడు ఎన్ని కుట్రలు చేసినా తాము అదిరేది, బెదిరేది లేదని అన్నారు. బుధవారం నాడిక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ నేతృత్వంలో రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉందని అన్నారు. ఆయనే రాజన్న రామరాజ్యాన్ని తీసుకురాగలరని ధీమా వ్యక్తం చేశారు.
సంక్షేమంపై బాబుకు పేటెంట్ హక్కులేవీ లేవని అన్నారు. ప్రజా సంకల్ప యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, అన్ని వర్గాల వారు తమ సమస్యలను జగన్‌కు చెప్పుకుని బాధపడుతున్నారని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోందని అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీ అవకతవకలు చోటు చేసుకున్నాయని, అవినీతి పెద్ద ఎత్తున జరిగిందని అన్నారు. ప్రత్యేక హోదాను ఫణంగా పెట్టి ప్రత్యేక ప్యాకేజీకి చంద్రబాబు ఒప్పుకున్నారని విమర్శించారు. హిట్లర్ మాదిరిగా చంద్రబాబు రాష్ట్రాన్ని పాలిస్తున్నాడని అన్నారు.
గెలుస్తాం, గెలుస్తాం అంటూ పైకి చెబుతూనే చివరకు ఓడిపోయే రీతిలో చంద్రబాబు గొబెల్స్‌ప్రచారం చేస్తున్నారని అన్నారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం జెర్రిపోతుల పాలెం గ్రామంలో దళిత మహిళను వివస్తన్రు చేసి వెంటాడి వేధించి, దౌర్జన్యం చేసిన ఘటనకు బాధ్యులైన టిడిపి నేతలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని బొత్స డిమాండ్ చేశారు. ఎపి అభివృద్ధికి వైఎస్‌ఆర్‌సిపి కట్టుబడి ఉందని, అభివృద్ధి సాధనకు కేంద్రంతో ప్రభుత్వం జరిపే పోరాటానికి తాము మద్దతు ఇస్తామని బొత్స తెలిపారు. పోలవరం ప్రాజెక్టును వైఎస్‌ఆర్ పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తే ఓడిశా రాష్ట్ర ముఖ్యమంత్రితో కుమ్మక్కై పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కోర్టులో కేసు వేయించారని తెలిపారు. అయినా ప్రాజెక్టు ఆగదని వైఎస్‌ఆర్ హెచ్చరించారని గుర్తు చేశారు.