తెలంగాణ

వర్గీకరణకు ప్రతినిధి బృందాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలి: బీజేపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 21: ఎస్సీ వర్గీకరణకు ప్రజా ప్రతినిధులతో కూడిన బృందాన్ని ప్రభుత్వం తక్షణమే ఢిల్లీకి తీసుకువెళ్లాలని బిజెపి శాసనసభాపక్ష నేత కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ జరగాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్‌పిఎస్ నాయకుడు మందకృష్ణ మాదిగ నేతృత్వంలో అనేక సంవత్సరాలుగా జరుగుతున్న ఉద్యమంలో భాగంగా ఎస్సీ వర్గీకరణపై పార్లమెంటులో చట్టం చేయాలని ప్రధానమంత్రికి, అన్ని పార్టీల జాతీయ నాయకులకు విజ్ఞప్తి చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నేతృత్వంలో ఢిల్లీకి అఖిల పక్ష బృందాన్ని తీసుకువెళ్లాలని కోరుతూ హైదరాబాద్‌లో జరిగిన ఉద్యమంలో అమరులైన ఎంఆర్‌పిఎస్ కార్యకర్త సంతాపసభ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మందకృష్ణను అరెస్టు చేసి అక్రమ కేసులు బనాయించి, జైలుకు పంపడాన్ని ఖండిస్తున్నట్టు చెప్పారు. ఉద్యమాలు చేయకుండా పోలీసు నిర్బంధంతో అణచివేయడం చాలా విచారకరమని, మందకృష్ణపై బనాయించిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకుని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.