రాష్ట్రీయం

ఆటోను ఢీకొన్న కారు: నలుగురు మహిళలు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచాల: రంగారెడ్డి జిల్లా మంచాల మండలం లింగాల వద్ద సోమవారం తెల్లవారుజామున ఆటోను కారు ఢీకొన్న ఘటనలో ఆటో డ్రైవర్‌తో పాటు నలుగురు మహిళలు మృతిచెందారు. చెన్నారెడ్డిగూడకు చెందిన 10 మంది మహిళలు కూరగాయలు మార్కెట్‌కు తరలించే నిమిత్తం ఆటోలో హైదరాబాద్‌ బయలుదేరారు. వారి ఆటో లింగాల వద్దకు చేరుకోగానే ఎదురుగా వేగంగా వచ్చిన కారు ఢీకొంది. దీంతో ఆటో డ్రైవర్‌ శ్రీను, సుజాత, మాధవి, మారు, అఫిలి అక్కడికక్కడే మృతిచెందగా, మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన ఇబ్రహీంపట్నం, హైదరాబాద్‌ ఆస్పత్రులకు తరలించారు. క్షతగాత్రుల్లో ముగ్గరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.