తెలంగాణ

కాంగ్రెస్‌కు నాదెండ్ల గుడ్‌బై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నికల భూమి......

* జనసేనలో చేరేందుకు రంగం సిద్ధం
* తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో పవన్‌ను కలిసి చర్చలు
గుంటూరు, అక్టోబర్ 11: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి స్పీకర్‌గా పనిచేసిన నాదెండ్ల మనోహర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. గురువారం ఈ మేరకు రాజీనామా పత్రాన్ని రాహుల్‌గాంధీకి పంపారు. మరో ఆరేడు నెలల్లో సా ర్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మ నోహర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం ఆ పార్టీకి షాక్‌నిచ్చింది. శుక్రవారం జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో అధికారికంగా నాదెండ్ల చేరనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. బుధవారం గుంటూరు నుంచి పవన్‌ను కలిసేందుకు మనోహర్ తిరుపతి బయలుదేరి వెళ్లారు. రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో పవన్‌ను కలుసుకున్నారు. శుక్రవారం ఇరువురు స్వామివారిని దర్శించుకున్న అనంతరం మనోహర్ జనసేన తీర్థం పుచ్చుకోనున్నారు. ఇలా ఉండగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో తిరిగి పుంజుకుందామని భావిస్తున్న కాంగ్రెస్ నేతలు నాదెండ్ల మనోహర్ రాజీనామా చేయడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. రెండుసార్లు తెనాలి ఎమ్మెల్యేగా, స్పీకర్‌గా పనిచేసిన నాదెండ్ల మనోహర్‌కు క్లీన్ ఇమేజ్ ఉండటంతో పాటు, అపార అనుభవం ఉంది.