అనంతపురం

హంద్రీనీవా కాలువ పనులు అడ్డుకున్న రైతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కదిరి రూరల్, అక్టోబర్ 15: కదిరి రూరల్ పరిధిలోని యర్రదొడ్డి కొత్తపల్లి వద్ద జరుగుతున్న హంద్రీనీవా కాలువ పనులను సోమవారం సీపీఎం నాయకులు, ఆ గ్రామ రైతులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యర్రదొడ్డి కొత్తపల్లి రైతులకు సంబంధించిన 200 ఎకరాలు వ్యవసాయ భూములకు పూర్వం నుండి ఇక్కడ రస్తా ఉండేదన్నారు. ప్రస్తుతం హంద్రీనీవా కాలువ నిర్మిస్తుండడంతో తమ పొలాలకు వెళ్లేందుకు రస్తా లేకుండాపోతోందని వాపోయారు. రస్తా సౌకర్యం లేకపోతే తాము పండించిన పంటలు ఇళ్లకు ఎలా తరలించాలని ప్రశ్నించారు. హంద్రీనీవా కాలువపై బ్రిడ్జి నిర్మించి రస్తా సౌకర్యం కల్పించి, తర్వాత పనులు చేసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. బ్రిడ్జి నిర్మాణం చేపట్టే వరకు కాలువ పనులు జరగనివ్వమని జేసీబీ యంత్రాలను అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న హంద్రీనీవా డీఈఈ నారాయణ, ఏఈఈ దాదాఖలందర్, వీఆర్‌ఓ మనోహర్, సర్వేయర్లు అక్కడికి చేరుకొని రాతపూర్వకంగా బ్రిడ్జి నిర్మించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.