జాతీయ వార్తలు

మూడు రాష్ట్రాల సీఎంల ప్రమాణ స్వీకారోత్సవానికి రండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 16: హిందీబెల్ట్‌లోని మూడు రాష్ట్రాలు రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ముఖ్యమంత్రుల ప్రమాణస్వీకారానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరవుతున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. జైపూర్‌లో జరిగే ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా రాజస్థాన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న అశోక్ గెహ్లాట్ ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబును ఆహ్వానించారు. ఈ మేరకు లేఖ రాశారు. మతతత్వశక్తులపై రాజీలేకుండా పోరాడేందుకు చేతలు కలుపుతామని గెహ్లాట్ ఆ లేఖలో తెలిపారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ కూడా తన ప్రమాణస్వీకారోత్సవానికి హాజరు కావాలని చంద్రబాబును ఫోన్‌లో వ్యక్తిగతంగా కోరారు. ఈ ఆహ్వానాన్ని టీడీపీ అంగీకరించినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిగా భూపేష్ బాగోల్ ప్రమాణ స్వీకారోత్సవానికి కూడా హాజరు కావాలని చంద్రబాబుకు ఆహ్వానం అందింది.