ఆంధ్రప్రదేశ్‌

ప్రసిద్ధ ఫోరెన్సిక్ శాస్తవ్రేత్త డాక్టర్ గాంధీకి పిన్నమనేని విశిష్ట పురస్కార ప్రదానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఎడ్యుకేషన్), డిసెంబర్ 16: పిన్నమనేని, శ్రీమతి సీతాదేవి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 28వ వార్షిక పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం ఆదివారం నగరంలోని పీబీ సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో జరిగింది. ఈ ఏడాది విశిష్ట పురస్కారాన్ని ప్రసిద్ధ ఫోరెన్సిక్ శాస్తవ్రేత్త డాక్టర్ గాంధీ పూర్ణచంద్ర కాజాకు ప్రదానం చేశారు. రూ. 5లక్షల నగదు బహుమతి అందజేశారు. ప్రముఖ రంగస్థల నటులు, జానపద కళా నిపుణులు కర్నాటి లక్ష్మీనరసయ్యకు రెండో పురస్కారంగా జ్ఞాపిక, రూ. లక్ష నగదు బహుమతిని డా. రామకృష్ణప్రసాద్, డా. చదలవాడ సుధ, డా. నాగేశ్వరరావు, డా. గొల్లపల్లి నాగేశ్వరరావు అందజేశారు. ఈసందర్భంగా డా. గాంధీ మాట్లాడుతూ ప్రజలను ప్రేమించకపోతే ప్రజాసేవ చేయలేమని అన్నారు. 15గుణాలు కలిగి నిత్యం దేశం కోసం, ప్రజల కోసం పోరాడిన నేత అబ్దుల్ కలాం అని గుర్తుచేశారు. రంగస్థల నటుడు లక్ష్మీనరసయ్య మాట్లాడుతూ కళలు జాతి వికాసానికి దోహదపడతాయని, జానపద కళలు ప్రజల్ని చైతన్యపరిచే సాధనాలన్నారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ చక్రవర్తుల రాఘవాచారి, డాక్టర్ ధూళిపాళ్ల రామకృష్ణ, టి చంద్రశేఖర్ పాల్గొన్నారు.

చిత్రం..డా. గాంధీ పూర్ణచంద్ర కాజాకు పురస్కారం ప్రదానం చేస్తున్న ప్రముఖులు