క్రైమ్/లీగల్

ప్రేమోన్మాది దాడిలో గాయపడిన రవళి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 4: ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన రవళి (22) సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. వరంగల్ నగరంలో గత బుధవారం ఉదయం రవళి హాస్టల్ నుంచి స్నేహితులతో కలిసి కళాశాలకు వెళ్తుండగా అదే కాలేజీకి చెందిన బీకాం ఫైనలియర్ చదువుతున్న పెండ్యాల సాయి అనే్వష్ అడ్డుకుని, రెచ్చిపోయి అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై ఆమెపై పెట్రోలు పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన రవళిని చికిత్స కోసం యశోద ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించారు. గత ఐదు రోజుల నుండి ఆమె పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. పెట్రోల్ మంటల్లో శ్వాసనాళాలు కాలిపోవడంతో శ్వాస తీసుకోలేని పరిస్థితుల్లో ఉండటంతో వెంటిలేటర్ సహాయంతో కృత్రిమ శ్వాస అందించినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఆమె కళ్లు దెబ్బతినడంతో చూపు సైతం కోల్పోవాల్సి వచ్చిందని వారు తెలిపారు.