ఆంధ్రప్రదేశ్
ఐదు లోక్సభ స్థానాలకు సీపీఐ, సీపీఎం అభ్యర్థులు ఖరారు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 21 March 2019
విజయవాడ, మార్చి 20: జనసేన, బహుజన సమాజ్ పార్టీలతో ఐదు లోక్సభ స్థానాల్లో పోటీకి పొత్తు కుదుర్చుకున్న వామపక్షాలు బుధవారం తమ అభ్యర్థులను ప్రకటించాయి. సీపీఐ తరపున విజయవాడ నుంచి న్యాయవాది చలసాని అజయ్కుమార్, కడప నుంచి ఏఐవైఎఫ్ నేత ఈశ్వరయ్య, అనంతపూర్ నుంచి డి జగదీష్ పోటీ చేస్తారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎస్ సుధాకర్రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. సీపీఎం తరపున కర్నూలు నుంచి కొమ్మిరెడ్డి ప్రభాకరరెడ్డి, నెల్లూరు నుంచి చండ్ర రాజగోపాల్ పోటీ చేస్తారని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెనుబల్లి మధు తెలిపారు.