ఆంధ్రప్రదేశ్
ఎపి పర్యాటక ప్రచారకర్తలుగా అజయ్,కాజోల్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 12 April 2016
విజయవాడ: ఎపిలో వినోదం, మీడియా క్రియేటివ్ సిటీ నిర్మాణానికి బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్ ఆసక్తి చూపుతున్నారని సిఎం చంద్రబాబు అన్నారు. ఇక్కడ మంగళవారం అజయ్, కాజోల్ దంపతులు సిఎంను మర్యాద పూర్వకంగా కలిసి పలు విషయాలపై చర్చించారు. ఎపిలో పర్యాటకరంగ ప్రచారకర్తలుగా పనిచేసేందుకు ఈ ఇద్దరూ స్వచ్ఛందంగా ముందుకువచ్చారు. హైదరాబాద్ను ఎంతగానో అభివృద్ధి చేసిన చంద్రబాబు ఎపి రాజధానిని కూడా అద్భుతంగా తీర్చిదిద్దుతారని అజయ్ అన్నారు. ఎపిలో పెట్టుబడులు పెట్టేందుకు తాను సిద్ధమేనని అయితే ప్రస్తుతం ఆ వివరాలు చెప్పలేనన్నారు.