జాతీయ వార్తలు
నర్మదా నదిలో ఐదుగురు గల్లంతు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 20 June 2019
మాండ్లా (మధ్యప్రదేశ్), జూన్ 20: మధ్యప్రదేశ్లోని మాండ్లా జిల్లాలో గురువారం దారుణం చోటుచేసుకుంది. నర్మదా నదిపై 15మందితో ప్రయాణిస్తున్న నాటు పడవ మునిగిపోవడంతో ఐదుగురు గల్లంతయ్యారు. వీరిలో నలుగురు మహిళలు కాగా ఒక ఉన్నారు. వీరి ఆచూకీ ఇంతవరకూ తెలియలేదు. మరో పదిమంది ఈదుకుంటూ ఒడ్డుకు చేరడంతో భారీ ప్రమాదం తప్పింది. సియోని జిల్లాలోని భఖారి ఘాట్ నుంచి మాండ్లా జిల్లాలోని గోగాన్ ఘాట్కు పడవపై వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనా స్థలానికి అదనపు కలెక్టర్ మీనా మశ్రామ్, సీనియర్ పోలీసు అధికారులు హుటాహుటిన చేరుకున్నారు. గల్లంతైన వారికోసం వెతుకులాట కొనసాగుతోంది.