క్రైమ్/లీగల్

అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్ల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్: అక్రమంగా గంజాయి రవాణకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్ రాష్ట్ర స్మగ్లర్లను శనివారం వరంగల్ కమిషనరేట్ టాస్క్ఫోర్స్, హసన్‌పర్తి పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టు చేసిన నిందితుల నుండి 32 లక్షల విలువ గల 320 కిలోల గంజాయితో పాటు రెండు కార్లు, రెండు కత్తులు, రెండు సెల్‌ఫోన్లు టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అరెస్ట్ అయిన వారిలో నిజామాబాద్ జిల్లాకు చెందిన షేక్ సోహెల్, మహారాష్ట్ర నాందేడ్ జిల్లాకు చెందిన మహమ్మద్ నద్దాం అలియాస్ షేక్ ఉన్నారు. మరొక నిందితుడు మహారాష్ట్ర నాందేడ్ జిల్లాకు చెందిన మహమ్మద్ యూనిస్ పరారీలో ఉన్నాడు. ఈ అరెస్టుకు సంబంధించిన వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ రవీందర్ వెల్లడించారు. టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసిన ఇద్దరు నిందితులతో పాటు తప్పించుకున్న మూడవ నిందితుడు కారు డ్రైవర్లు కావడంతో నిజామాబాద్, నాందేడ్ జిల్లా మధ్య ట్రావెల్స్ ద్వారా ప్రయాణికులను చేరవేసే క్రమంలో ఇద్దరి మధ్య స్నేహం కుదరండంతో ముగ్గురు నిందితులు కల్సి జల్సాలు చేయడం ప్రారంభించారు. వీరికి కారు డ్రైవింగ్ ద్వారా వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో పాటు మహారాష్ట్ర, యూపీ రాష్ట్రాల్లో గంజాయికి మంచి డిమాండ్ ఉందని గుర్తించి ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం నుండి గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేసి మహారాష్ట్ర, యూపీ, రాష్ట్రాల్లో ఎక్కువ ధరకు అమ్మి డబ్బు సంపాదించాలనే ఆలోచనతో నిందితులు ముందుగా పోలీసులకు అనుమానం రాకుండా ఉండేందుకుగాను ఖరీదైన రెండు కార్లను లీజుకు తీసుకొని వాటి ద్వారా గంజాయిని తరలించేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా నిందితులు తమకు తెలిసిన సమాచారం మేరకు విశాఖపట్నంలో ఒక వ్యక్తి వద్ద 320 కిలోల గంజాయిని నాలుగు , రెండు కిలోల ప్యాకెట్లుగా మార్చి వాటిని ఎవరికీ అనుమానం రాకుండా ఉండేవిధంగా తమ కారులో రహస్యంగా అమర్చారు. వాటిని రాజమండ్రి, భద్రాచలం, ఖమ్మం, తొర్రూర్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల మీదుగా మహారాష్ట్ర , యూపీ రాష్ట్రాల్లో అధిక ధరలకు అమ్మి సొమ్ము చేసుకోవడం ప్రారంభించారు. ఈ ముఠా సభ్యులు ఇదే తరహాలో శుక్రవారం విశాఖపట్నం నుండి గంజాయిని కొనుగోలు చేసి కారులో తరలిస్తున్నట్టు టాస్క్‌పోర్స్ పోలీసులకు పక్కా సమాచారం అందడంతో అప్రమత్తమై శనివారం హసన్‌పర్తి-ఎల్లాపూర్ బ్రిడ్జిపై వాహనాల తనీఖీలు నిర్వహిస్తుండగా అదే సమయంలో వచ్చిన నిందితులు ప్రయాణిస్తున్న కార్లను తనిఖీ చేయడంతో కార్లలో గంజాయిని గుర్తించారు. పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నట్టు అంగీకరించడంతో పాటు మూడవ నిందితుడు తన వ్యక్తిగత అవసరాల నిమిత్తం మార్గమధ్యంలోనే దిగిపోయాడని పోలీసుల ఎదుట అంగీకరించారు. నిందితులను అరెస్టు చేయడంతో పాటు గంజాయిని స్వాధీనం చేసుకోవడంతో ప్రతిభ కనబరిచిన టాస్క్ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ నందిరాం నాయక్, తిరుమల్, హసన్‌పర్తి ఇన్‌స్పెక్టర్ శ్రీ్ధర్‌రావు, టాస్క్ఫోర్స్ హెడ్‌కానిస్టెబుల్ శ్యాంసుందర్ తదితరులను పోలీస్ కమిషనర్ రవీందర్ అభినందించారు. సమావేశంలో కాజీపేట ఏసీపీ రవీంద్రకుమార్ ఉన్నారు.
*చిత్రం... స్వాధీనం చేసుకున్న గంజాయి వివరాలు వెల్లడిస్తున్న వరంగల్ పోలీస్ కమిషనర్ రవీందర్