నల్గొండ

కృష్ణా నదిలో మునిగి వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దఅడిశర్లపల్లి, మే 30: మండలంలోని నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ సమీపంలో బాణాలకుంట వద్ధ కృష్ణా నదిలో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు నదిలో పడి బంగిన్ ప్రకాశ్‌రావు(30) దుర్మరణం చెందాడు. మృతుడు మహబూబ్‌నగర్ జిల్లా వెల్లండి మండలం జూపల్లి గ్రామానికి చెందిన వాడుగా గుర్తించారు. అతను ప్రస్తుతం హైద్రాబాద్‌లో ఉంటున్నాడని అదివారం పెద్దవూర మండలంలోని పులిచెర్ల సమీపంలోగల బాస్మాన్‌బావి వద్ధ బంధువుల ఇంట్లో శుభకార్యంకు హాజరయ్యేందుకు స్నేహితులతో కలిసి వచ్చాడు. విందు అనంతరం కృష్ణా నదిలో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు నదిలో మునిగి చనిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా ఎస్‌ఐ బోజ్యా నాయక్ తెలిపారు. అయితే ప్రకాశ్‌రావును తోటి స్నేహితులే కొట్టి నీటిలో పడేసి చంపారంటు బంధువులు ఆరోపిస్తున్నారు. సంఘటన స్థలాన్ని సిఐ వెంకటేశ్వర్‌రెడ్డి, ఎస్‌ఐలు బోజ్యానాయక్‌లు పరిశీలించారు.