తెలంగాణ

యువతిపై అత్యాచారం.. హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేములవాడ, జూలై 25: కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం అగ్రహారం ఆంజనేయస్వామి దేవాలయం వెనకభాగంలోని చెట్ల పోదలలో సోమవారం ఉదయం హత్యకు గురైన ఒక యువతి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. వేములవాడ సిఐ శ్రీనివాస్ కథనం ప్రకారం వివరాలు ఇలాఉన్నాయి. ఉదయం 10 గంటల ప్రాంతంలో ఆ ప్రదేశంలో గుర్తు తెలియని యువతి మృతదేహం పడిఉందనే సమాచారంతో సంఘటనా స్థలానికి వెల్లి సదరు యువతి మృతదేహాన్ని పరిశీలించామన్నారు. అత్యాచారం గావించిన అనంతరం చున్నితో ఉరివేసి బిగించి హత్యచేసినట్లు ప్రాథమికంగా నిర్థారణకు వచ్చామని, అయితే మృతురాలును గౌడ కల్పన (30) తంగళ్లపల్లి స్వస్థలంగా గుర్తించామని, ఆమె భర్త శ్రీనివాస్ గతకొద్దిరోజుల క్రితం ఒక వివాహం నిమ్మిత్తం షోలాపూర్ వెల్లి ఇంకా తిరిగి రాలేదని, కల్పనకు సన్నిహితుడైన వ్యక్తే నమ్మించి ఇక్కడికి తీసుకువచ్చి అత్యాచారం గావించి హత్య చేసినట్లుగా తెలుస్తోందని సిఐ తెలిపారు. కాగా మృతురాలి మెడలో బంగారు పుస్తెలతాడు అలాగే ఉండటం, పెద్దగా ప్రతిఘటించినట్లు ఆనవాళ్లు లేకపోవడంతో వివాహేతర సంబంధం ఉన్న వ్యక్తే నమ్మించి ఇక్కడి తీసుకువచ్చి ఈ ఘతుకానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతురాలి వద్ద ఉన్న సెల్‌ఫోన్‌లోని నెంబర్‌లపై నిఘావేశామని, త్వరలో నిందితున్ని పట్టుకుంటామని సిఐ శ్రీనివాస్ పేర్కొన్నారు. మృతురాలికి ఇరువురు పిల్లలు ఉండగా ఉపాధి నిమ్మిత్తం సిరిసిల్ల పట్టణంలో నివాసం ఉంటుంది.

చిత్రం.. అగ్రహారం గుట్టల వద్ద చెట్లపొదల్లో అత్యాచారానికి, హత్యకు గురైన గౌడ కల్పన మృతదేహం