రాష్ట్రీయం

సినీ ఫక్కీలో 30లక్షలు దోపిడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, డిసెంబర్ 30: పట్టపగలు క్షణం వ్యవధిలో డ్రైవర్‌ను బురిడి కొట్టిచ్చి కారులో ఉన్న 29.70 లక్షల రూపాయలను గుర్తు తెలియని దుండగులు దోచుకెళ్ళిన సంఘటన బుధవారం తిరుపతిలోని తిలక్ రోడ్డులోని శ్రీదేవి కాంప్లెక్స్ వద్ద జరిగింది. తిరుమల నారాయణ గిరి అతిథి భవనాల మధ్య ఉన్న టిటిడికి చెందిన భవనంలో బెంగళూరుకు చెందిన ఎస్‌విజి గ్రూపు సంస్థ సారంగి పేరుతో హోటల్ నడుపుతోంది.
ఈ క్రమంలో హోటల్లో వచ్చిన కలెక్షన్ సుమారు 30లక్షల రూపాయలు నగదును బెంగళూరులోని సంస్థకు అందజేయడానికి మేనేజర్ భానుప్రకాష్ రెడ్డి బుధవారం మధ్యాహ్నం తిరుమల నుంచి కారులో బయలుదేరాడు. మార్గమధ్యంలో తిరుపతికి వచ్చి హోటల్‌కు సంబంధించిన మెను డిజైన్ తీసుకోవడానికి శ్రీదేవి కాంప్లెక్స్ వద్ద కారు పార్క్ చేసి తనతో సహాయంగా వచ్చిన తన స్నేహితుడు మోహన్ దుకాణం వద్దకు పంపి భానుప్రకాష్ రెడ్డి కారులో కూర్చొన్నాడు. ఒక వ్యక్తి అక్కడికి వచ్చి 10 రూపాయలు కింద పడి ఉన్నదని చెప్పడంతో భానుప్రకాష్ రెడ్డి కారు డోరు తిసి దిగాడు. అదే సమయంలో అటు వైపుడోరు తీసి 29.70 లక్షల రూపాయలున్న బ్యాగును తస్కరించి పారిపోయాడు. దీంతో భానుప్రకాష్ రెడ్డి కేకలు వేసిన ప్రయోజనం లేకపోయింది. వెంటనే క్రైం పోలీసులకు సమాచారం అందించారు.
డి ఎస్పీ సత్యనారాయణ వెంటనే తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దోపిడి జరిగిన తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి సిసి కెమెరాల పుటేజిని పరిశీలిస్తున్నారు. నేరస్తులను త్వరలోనే పట్టుకుంటామని డి ఎస్ పి సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు.