తెలంగాణ

విదేశాల్లో మన విద్యార్థుల మృత్యువాత కలచివేస్తోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 16: అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో ఓ దుండగుడి కాల్పుల్లో తెలుగు విద్యార్థి వంశీ మామిడాల మృత్యువాత పడటంపై కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. విదేశాల్లో చదువుకుంటున్న తెలుగు విద్యార్థులు అక్కడ దురాగతాలకు గురై ప్రాణాలను కోల్పోవడం మనసు కలచివేసిందని అన్నారు. సంఘటన జరిగిన వెంటనే అమెరికాలోని భారత కాన్సులేట్ అధికారులు వంశీ సంబంధీకులు అందరికీ సమాచారం చేరవేసి మృతదేహం తరలింపునకు అన్ని రకాలుగా సహకారం అందిస్తామని చెప్పారని మంత్రి పేర్కొన్నారు. తాను విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌తో మాట్లాడి మృతదేహాన్ని హైదరాబాద్‌కు రప్పించడానికి సహకరించమని కోరామని పేర్కొన్నారు. వంశీ మృతదేహాన్ని స్వస్థలానికి తెచ్చుకునేందుకు అయ్యే ఖర్చును భరించే స్థితిలో ఆయన కుటుంబం లేదని తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన సమాచారం మేరకు అందుకు అయ్యే వ్యయాన్ని కూడా భారత కాన్సులేట్ భరించాలని తాను విన్నవించానని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు.