మెరుపు

బహుదూరపు బాటసారి( కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంకట్రావు మాష్టారు ఒక గవర్నమెంటు స్కూలు టీచరు. చాలీచాలని జీతం. ముగ్గురు మగ పిల్లలు, ఒక ఆడపిల్ల. వచ్చే జీతం చాలక సంసార సాగరం ఈదలేక సతమతమవుతూ ఉంటాడు. పెద్ద కొడుకు ఎదిగి చేతికి అంది వస్తాడనుకొనేసరికి ప్రేమ, పెళ్లి అనే ముసుగులో అత్తారింటికి అల్లుడయి ఇల్లరికం వెళ్లిపోయాడు. మాష్టారు జీవితంలో ఇది కోలుకోని దెబ్బ. అప్పటికీ కూతురు పెళ్లీడుకొచ్చింది. రెండో కొడుకు సత్యారావు 8వ తరగతి చదువుతున్నాడు. ఇంట్లోని పరిస్థితులు గమనిస్తున్నాడు. అన్న చేసిన దుర్మార్గం తను చేయకూడదని ఆ వయస్సులోనే ఆదర్శభావాలతో నిశ్చయించుకున్నాడు. ఒకప్రక్క చదువు మానేయలేదు. ఆ యింటి ఆడపడుచుకు ఓ చిన్న సంబంధము చూసి, పెళ్లి అయిందనిపించారు. పెళ్లి చేసి తిరిగి వెనక్కి తిరిగి చూస్తే ఆ రోజుల్లో అరవై వేల రూపాయలు అప్పు తేలింది.
ఇంతలో తండ్రికి రిటైర్‌మెంట్ వచ్చిన డబ్బు అప్పులకే సరిపోయింది. సత్యారావు ఎలాగో స్నేహితుల ద్వారా విశాఖపట్నం పోర్టులో ఓ చిన్న టెంపరరీ ఉద్యోగము సంపాదించుకున్నాడు. టెన్త్‌పరీక్షలకు వెళ్లలేదు. పరీక్షల ఫీజుకు డబ్బులు లేక చదువు ఆగిపోయింది. మదిలో ఎనె్నన్నో భావాలు, రోజూ జీవితంలో జరుగుతున్న సంఘటనలు అప్పుడప్పుడు అతనికి వచ్చే రచయిత భావాలు తెల్లకాగితాలకే పరిమితం అవుతుండేవి. సత్యారావుకు వచ్చే జీతము, ఇంటి ఖర్చులకు అరకొరగా సరిపోతుండేవి. వెంకట్రావు మాష్టారు ఆ ముసలితనములో ప్రామిసరీ నోట్లు, అలా వ్రాస్తూ తన రెండో కొడుకు సత్యారావు ఏదో ఉడతా సహాయము చేస్తుండేవాడు. తమ్ముడు చంటిని మెల్లగా ఇంటర్మీడియట్ వరకు లాక్కొచ్చాడు.
చంటి కూడా ఇంట్లో పరిస్థితులు అర్థము చేసుకొని ఉద్యోగ ప్రయత్నాలు మొదలు పెట్టాడు. వెంకట్రావు మాష్టారు మరణం ఆ కుటుంబములో అందరికీ ఆశనిపాతం అయింది. ఊర్లో అతని మంచితనము అందరు పొగిడి ఎంతో సానుభూతి చూపి కొంత ఆర్థిక సాయం చేశారు. నిండు ముతె్తైదువులా ఉన్న తన తల్లిని విధవలా చూడడము వాళ్లకి ఇంకా మింగుడుపడడము లేదు.
జీవితకాల గమనములో రోజులు, వారాలై, వారాలు నెలలు సంవత్సరాలు దాటుచున్నవి. తల్లి పట్టుదలతో సత్యారావు ఓ యింటివాడయ్యాడు. తమలాగే సత్యారావు భార్య పుట్టింటివారు ఓసాదా సీదా గుమాస్తా కుటుంబం. మధ్యతరగతి కుటుంబీకుల గాథలు సత్యారావుకు తెలుసు కాబట్టి సత్యారావు తన భార్య ఏం తెచ్చిందో, ఏం తేలేదో కూడా పట్టించుకోలేదు. అప్పుడప్పుడు వచ్చి వెళ్తున్న ఆడపడుచు యొక్క సతాయింపులు సత్యారావు భార్యను క్రుంగతీసేవి. పడ్డవాడెప్పుడూ చెడ్డవాడు కాదని తన భార్యకు నచ్చచెప్పి సముదాయించేవాడు.
ఇంతలో తన తమ్ముడు చంటికి ఆర్.టి.సిలో కండక్టరు ఉద్యోగం వచ్చింది. పోనీలే తమ్ముడు కూడా కలిసి వచ్చాడు అనుకున్నాడు సత్యారావు. కండక్టరు ఉద్యోగం రాగానే ఎక్కడలేని సంబంధాలు వచ్చేవి. ఉన్నంతలో ఓ మంచి సంబంధం చేశాడు తమ్ముడికి సత్యారావు. పెళ్లయిన ఆరు నెలలు తిరగకముందే వేరు ఇంటి కాపురం పెట్టించింది ఆ కొత్తకోడలు. ఎవరి స్వార్థం వారిది. ఇంతలో సత్యారావు తల్లి, అనారోగ్యం, మందులు ఖర్చులు తడిసి మోపెడయ్యాయి. మధ్య తరగతి సగటుజీవి టీలో పడ్డ ఈగలా గిలగిలా గింజుకుంటున్నాడు సత్యారావు. ఇంటిలో పెద్దదిక్కుగా ఉన్న తల్లి హఠాన్మరణం సత్యారావును బాగా కృంగదీసింది. కనిపెంచిన తల్లి తన ఇంట్లో నడయాడక పోవడం అతను జీర్ణించుకోలేకపోయాడు. ఏం చేస్తాం! కాలం ఆగదు కదా?
సత్యారావు ఇద్దరు ఆడపిల్లలు పుట్టగానే కుటుంబ నియంత్రణ ఆపరేషను చేసుకుందామనుకున్నాడు. కాని కొడుకుకోసం ఇంకా ఇంకా చూద్దామనుకున్నాడు. కాని మూడోసారి ముచ్చటగా ఆడపిల్లే పుట్టింది. ముగ్గురు ఆడపిల్లలతో సంసారం, తమ్ముడు వేరే కుంపటి, సత్యారావుని మానసికంగా క్రుంగదీసేవి. కానీ ఏం చేస్తాడు. విధిలిఖితం. జరిగేది జరగకమానదు కదా! సంసారం తన జీవితములో చదరంగం అయ్యింది. కాలము తన పని తాను చేసుకుంటూ పోతుంది. సగటు మనిషి జీవితం అప్పులతో సతమతమవుతుంటాడు. సంసారం ఒక మహాసాగరం, ఎంత ముందుకు సాగి ఈదుదామని అనుకున్నా ఒక్కొక్కసారి పెద్ద పెద్ద అలల్లా వచ్చి ఖర్చులు పెరిగి, పిల్లల పెళ్లిళ్లు తన గుండెలమీద కుంపట్లా పెరగసాగాయి. పిల్లల చదువులు పదవ తరగతి వరకు వచ్చి ఇక ముందుకు వెళ్లలేక ఆగిపోయాయి. గంతకు తగ్గ బొంతల్లా ముగ్గురు పిల్లల పెళ్లిళ్లు ఓ యజ్ఞంలా, అప్పుల బాధల ఊబిలో ఇరుక్కుపోయి మెల్లగా ఏదో అయిందనిపించారు.
పిల్లలను కంటాము కాని వారి తల రాతలను మనముకంటామా? ఇప్పడే అసలు పిల్లల మనస్సులోని అంతరంగాలు బయటపడ్డాయి. ఇంతకాలం కని పెంచి పెద్దచేసిన తన పిల్లలే తనకు శత్రువులయ్యారు. ఏ జన్మలో చేసిన పాపమో గాని వాళ్ల గొంతెమ్మ కోరికలు తీర్చడానికి తన ఉద్యోగానికి వాలంటరీ రిటైర్‌మెంటు పెట్టి కొద్ది కొద్దిగా తీర్చాడు. కాని తన పిల్లలు వారి అహంకారాల వలన తమ కాపురాల్ని తామే చెడుగొట్టుకొంటున్నారు.
పెద్దమ్మాయి సరళ కాపురం కొంత నయాన్నో భయాన్నో చెప్పి ఓ దారిలోనికి తీసుకొని వచ్చాడు సత్యారావు. రెండో అమ్మాయిది ప్రేమ వివాహము అయినా కట్నం తీసుకోకపోయినా అడపాదడపా వారి కుటుంబ ఖర్చులు కూడా తనమీదే పడ్డాయి. నిరుద్యోగ కుటుంబం. ఒక అక్క,, ఓ తమ్ముడు అతనికి. ఇంక మూడో అమ్మాయికి ముచ్చటగా కట్నం పోసి చేసిన పెళ్లి కాస్తా పెటాకులు అయ్యింది. పెళ్లి చేసిన మూడు నెలలకే తన చిన్న అల్లుడు ఓ యాక్సిడెంట్‌లో పోయాడు. చిన్న తనములో వైధవ్యం. ముఖాన బొట్టు చెరిపేసుకొని వచ్చిన కన్నకూతుర్ని చూసి ఏడవని రోజు లేదు ఆ దంపతులకు, ఏది ఏమైనా కాలము ఆగదు కదా. గుడ్డిలో మెల్లలా అప్పుడప్పుడు కూడబెట్టిన డబ్బుతో ఓ చిన్న యిల్లు కొనుక్కోవడం మంచిదయింది.
కొడిగట్టిన దీపంలా వచ్చిన పెన్షన్ చాలక చిన్న చిన్న ట్యూషన్స్ చెపుతూ తన భార్యకు తోడుగా ఉన్న కుట్టుమిషనుతో ఆ ఇల్లును సంసారనౌకను మునిగిపోకుండా అలా జీవితము నెట్టుకొస్తున్నాడు సత్యారావు బహుదూరపు బాటసారిలా.
మధ్యతరగతి జీవితాలు ఎంత ముందుకు సాగుదామని అనుకున్నా ముందడుగులు పడవు. సామాన్యముగా ఎప్పటికప్పుడు ఏదో సమస్య. పిల్లలకు సర్దిచెప్పి, చక్కదిద్ది ఓ దారిలో పెట్టడం ఎంతో గగనమై పోతుంది అతని జీవితానికి. సమస్యలు వస్తూనే ఉంటాయి. జీవితాలలోనికి అవి చక్కదిద్ది సరైన న్యాయం చేయలేక పోతున్నాననే బాధతో సత్యారావు ఎప్పుడూ దిగులు పడుతుండేవాడు. ఎన్ని సమస్యలు వచ్చినా కాలగమనం తన పని తాను చేసుకుంటూ వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు సాగిపోతూనే ఉంది. తరాలు మారినా సమస్యలన్నీ మధ్య తరగతి కుటుంబీకులకే వస్తాయి. జీవితగమనములో కొట్టుకు పోవలసిందే. జీవన చదరంగములో ఏ పావు ఎక్కడికి జరుగుతుందో అతనికే తెలియదు. కాలచక్ర గమనములో ఓ సంసారికి, నడమంత్రపు సిరి వచ్చిపడితే తప్ప ఆ సంసారములో సరిగమలు రెండెడ్ల బండిలా ప్రయాణం ముందుకు సాగవలసిందే. సత్యారావు జీవితములో ఎనె్నన్నో ఒడిదుడుకులు చూస్తూ గమ్యం తెలియని బాటసారిలా వార్ధక్యాన్ని ఆస్వాదిస్తూ కాలం వెళ్లదీస్తున్నాడు. తనకున్న పరిధిలో తన చుట్టూ ఉన్న ఓ చిన్న ప్రపంచంలో ఉన్న చిన్నా పెద్దా గ్రామస్థులందరిని కలుపుకుంటూ ప్రభుత్వానికి మద్దతుగా స్వచ్చ్భారత్ ఆదర్శాలను అందరికీ విపులంగా విశదీకరిస్తూ ఓ అడుగు ముందుకు వేసి కాలువలోని పూడికలను రహదారులకిరువైపులా మొక్కలను నాటిస్తూ ఆ ఊరికి ఓ పెద్దమనిషిలా, తండ్రిలా ఆ వూర్లో అందరితో కలసి జీవనయాత్ర వార్ధక్యపు ఛాయలను అధిగమిస్తూ ముందుకు సాగిపోతున్నాడు సత్యారావు ఓ సంపూర్ణ మనిషిలా.

- వేగి నూకరాజు, 7702141014
**
ముందుచూపు

‘‘నా మరణానంతరం నా యవదాస్తి, అప్పుల మీద పూర్తి హక్కులు నా భార్య అయిన కనకానికి ఇచ్చుచున్నాను. పూర్తి స్వేచ్ఛగాను, ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా ఉన్న పరిస్థితిలో ఇది రాస్తున్నాను. ఈ వీలునామాకు సాక్షులు’’ చదివాడు సుందరమూర్తి.
కనకం కన్నీళ్లు పెట్టుకుంది. భర్త గోవిందం గుర్తొచ్చి.
‘‘నాకోసం ఏం తగలేయనక్కరలేదు. నా పాస్‌బుక్‌లో ఉన్నది వాడండి చాలు’’ భర్త అనే మాటలు గుర్తుకొచ్చాయి ఆమెకి.
గోవిందం బూడిదగా మారి మూడు రోజులయింది.
రిజిస్టర్ పోస్టులో ఒక లెటర్ వచ్చింది కొడుక్కి. అది తండ్రి రాసింది. చనిపోయిన వాడెలా రాశాడో అనుకున్నారు అంతా.
ఆ ఉత్తరంలో ఇలా ఉంది.
‘కనకానికి ఆశీస్సులు. నా గురించి ఎక్కువ ఖర్చు చేయనక్కరలేదు. అకౌంట్‌లో యాభైవేలు ఉన్నాయి. చాలంతే. నీ పేరిట ఏడు లక్షలు ఉంచాను. అందులో ఆరు లక్షలు నీ మరణానంతరం అంత వరకు నిన్ను బాగా చూసుకున్న వారికి అంతా గానీ, నీకు నచ్చినంత గానీ ఇవ్వవచ్చు. మిగిలిన మొత్తం ఇక ఈ నాలుగు లక్షలు నీ ఖర్చులకు పది సంవత్సరాలకు వాడుకోవలసి ఉంది. దీంట్లో పిల్లలకు ఎటువంటి హక్కులుండవు. బాబుకు ఉద్యోగం, ఉద్యోగస్తురాలైన పిల్ల ఉంది. బతుక్కి లోటులేదు. వాడు కొనుక్కున్న ఇల్లు అనుభవించాలే గానీ అమ్మేయకూడదు. అమ్మాయికి జీవితం స్థిరపడలేదు కాబట్టి నీ నగల్లో మూడు వంతులు అమ్మాయికి ఇవ్వాల్సి ఉంటుంది. ఈలోగా ఉద్యోగస్తురాలైతే చెరిసగం అమ్మాయికి, కోడలికి నీ తదనంతరం పంచెయ్. అమ్మాయి పేర అయిదు లక్షలు ఉంచాను. వడ్డీ మాత్రం ఖర్చు చేయాలి. అసలు పదేళ్ల తర్వాత వాడుకోవాలి. నా కోసం ఎవరూ బాధపడొద్దు. కన్నీళ్లు అమూల్యమైనవి పొదుపుగా వాడుకో’. సెలవ్.
- నీ గోవిందం