రాష్ట్రా లకు నష్టమా?
Published Wednesday, 23 November 2016నవంబర్ 8వ తేదీ రాత్రి భారత ప్రధాని నరేంద్రమోదీ పెద్ద నోట్ల రద్దు ప్రకటన తర్వాత దేశవ్యాప్తంగా నిరసనల ఉప్పెన సునామిగా మారింది. నగదు మార్పిడి ఒక పెద్ద సమస్యగా , బ్యాంకుల వద్ద బారులు తీరిన ప్రజలతో అంతా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఉన్న నగదు మార్చుకోవాలన్నా, బ్యాంకుల్లో ఉన్న నగదు ఉపసంహరించుకోవాలన్నా చాంతాడంత క్యూలలో జనం నిల్చుని సిగపట్లు పడుతున్నారు. ప్రజల నుండి తిరుగుబాటు ఎదురుకాకముందే నష్టనివారణ చర్యలు మొదలయ్యాయి. ఇప్పటికే తెలంగాణ, కేరళ, పశ్చిమబంగా రాష్ట్రాలు నోట్ల రద్దుపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి.