ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు
Published Tuesday, 31 May 2016సంగారెడ్డి టౌన్, మే 30: తెలంగాణ రాష్ట్రం సాధించి జూన్ 2 నాటికి రెండు సంవత్సరాలు పూర్తవుతుండగా, రాష్ట్రంలో లక్షలాది మంది ఉన్న కార్మికులు కనీస వేతనాల జీవోలను ఇప్పటి వరకు సవరించకుండా ప్రభుత్వం వివక్షకు గురి చేస్తోందని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.రాజయ్య ఆవేదన వ్యక్తం చేసారు. ఈ మేరకు సోమవారం ఎజెసి వెంకటేశ్వర్లుకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 52 రంగాల కనీస వేతనాల జీవోల కాలపరిమితి ముగిసి అనేక సంవత్సరాలు గడుస్తున్నాయన్నారు.