విద్యుదాఘాతంతో మహిళ మృతి
Published Tuesday, 31 May 2016తిప్పర్తి, మే 30: మండలంలోని మామిడాల గ్రామంలో సోమవారం విద్యుదాఘాతానికి గురై నిర్మల(27)అనే మహిళ దుర్మరణం చెందింది. నిర్మల ఇంటి పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ ద్వారా ఇంటికి ఎర్తింగ్ కావడంవల్ల మెట్లు ఎక్కుతున్న నిర్మలకు మెట్ల సీకుల ద్వారా విద్యుత్ షాక్ తగలడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు. గతంలో ట్రాన్స్ఫార్మర్తో ఎర్త్ అవుతుందన్న సమస్యను అధికారులకు విన్నవించినప్పటికి పట్టించుకోలేదని చివరకు నిర్మల ప్రాణాలు పోయాయంటూ ఆగ్రహించిన గ్రామస్తులు సబ్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు.