సమ్మె విరమించిన పెట్రో ట్యాంకర్ల యజమానులు
Published Monday, 30 May 2016హైదరాబాద్ : తెలంగాణలో అధికారులు, పెట్రో ట్యాంకర్ల యజమానుల చర్చలు సోమవారం మధ్యాహ్నం సఫలమయ్యాయి. సమ్మెకు సంబంధించి ఆయిల్ ట్యాంకర్ల అధికారులు, పెట్రో ట్యాంకర్ల యజమానులతో చర్చలు జరిగాయి. సమావేశం అనంతరం సమ్మెను విరమించుకుంటున్నట్లు పెట్రో ట్యాంకర్ల యజమానులు చెప్పారు. అయితే ఆది తాత్కాలికం మాత్రమేనని, రేపు ప్రభుత్వంతో మరోసారి చర్చలు జరిపి ప్రకటిస్తామని తెలిపారు.