S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపాదకీయం

02/15/2016 - 01:20

అదిగో పులి అని అరిస్తే ఇదిగో తోక...అని అన్నట్టుగా కథ నడుస్తోంది! ఈ కథ ఆంగ్ల రచయిత రాసీపురం కృష్ణస్వామి నారాయణ్ ముప్పై ఐదేళ్ల క్రితం వ్రాసిన కథకు కొంత మేర పునరావృత్తి! చిరుతపులి విరుచుకొని పడుతోందన్న భయంతో బెంగుళూరు తూర్పు శివార్లలోని నూట ముప్పయి పాఠశాలలకు గురువారం అధికారులు సెలవిప్పించారట. ఇలా సెలవిప్పించడం ముందు జాగ్రత్త చర్యలలో భాగం!

02/12/2016 - 22:44

పాకిస్తాన్ ప్రభుత్వానికి తొత్తులైన జిహాదీ ఉగ్రవాదులను అమాయకులుగా చిత్రీకరించడానికి జరిగిన ఒక కుట్ర భగ్నమైంది. ఇష్రాత్ జహాన్ అనే బీభత్సకారిణి పాకిస్తానీ లష్యర్ ఏ తయ్యబా ముఠా సభ్యురాలని డేవిడ్ కాలెమన్ హెడ్లీ ముంబయిలోని ప్రత్యేక న్యాయస్థానానికి గురువారం తెలియజేయడం ఇందుకు ప్రాతిపదిక. 2008 నవంబర్ నాటి ముంబయి బీభత్సకాండను నిర్వహించిన హెడ్లీ కూడ లష్యర్ ఏ తయ్యబా సభ్యుడు.

02/12/2016 - 05:21

ఐదు రోజులపాటు హిమ గహ్వరంలో కూరుకునిపోయిన యుద్ధవీరుడు కొప్పడ హనుమంతప్ప బతికి బయటపడడం విధి విలాసం...మూడు రోజులు గడవక ముందే ఆ సమరుడు అమరుడుగా మారడం విధి విలాపం! దాదాపు ఇరవై వేల అడుగుల ఎత్తయిన సియాచిన్ హిమ ఖండం హఠాత్తుగా మృత్యు భాండంగా మారడం ఫిబ్రవరి మూడవ తేదీనాటి ఘటన. హిమప్రళయం సియాచిన్‌లోని సోనమ్ స్థావరాన్ని నుజ్జునుజ్జుగా నలిపి పారేసింది!

02/11/2016 - 05:57

విదేశాలకు చెందిన చిల్లర దోపిడీ సంస్థలను దేశం నుండి వెళ్లగొట్టే వ్యవహారంలో వాగ్దాన భంగం చేయడం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం వారు మాజీ ప్రధానమంత్రి మన్‌మోహన్ సింగ్‌కు ఘన గౌరవాన్ని ప్రదానం చేస్తున్నారు. వాల్ మార్ట్ వంటి విదేశీయ సంస్థలు చిల్లర వ్యాపారంలోకి చొరబడకుండా నిరోధిస్తామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భారతీయ జనతాపార్టీ వారు అత్యంత ఆర్భాటంగా ప్రచారం చేశారు.

02/10/2016 - 04:35

జిహాదీ ఉగ్రవాదులు 2008 నవంబర్ 26వ తేదీన ముంబయిలో జరిపిన భయంకర బీభత్సకాండ పాకిస్తాన్ ప్రభుత్వ పథకమన్న వాస్తవం సోమవారం మరోసారి ధ్రువపడటం ఆశ్చర్యకరం కాదు. మన ప్రభుత్వాలు దశాబ్దుల తరబడి ఈ వాస్తవాన్ని అంతర్జాతీయంగా ప్రచారం చేయకపోవడం వల్ల మాత్రమే ఉగ్రవాద బాధితులను దేశ ప్రజలను నిరంతరం దిగ్భ్రాంతికి గురి చేస్తున్న వాస్తవం.

02/09/2016 - 06:00

నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తూ కొద్దికాలం క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం గోముఖ్ నుంచి, హరిద్వార్ వరకు గంగానదిలో ఎవైనా చెత్త వేసినట్లయతే రూ.20 వేల వరకు జరిమానా విధి స్తారు. గంగానది కాలుష్యపై నివేదిక పంపాలని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి కూడా ఎస్‌జిటిని ఆదేశిం చింది. ఆదేశాలు పాటించని కంపెనీలను మూసివే యాలని కూడా ఎస్‌జిటిని ఆదేశించింది.

02/09/2016 - 05:31

సముద్ర ప్రాంత ప్రశాంతి లక్ష్యంగా నౌకాదళ వైమానిక విభాగం జరిపిన సమర విన్యాసాలకు చైనా కొనసాగిస్తున్న వ్యూహంలో దురాక్రమణ ప్రధాన కారణం..శనివారం, ఆదివారం విశాఖపట్టణం సముద్ర తీరంలో ప్రస్ఫుటించిన మన సమర పటిమ లక్ష్యం యుద్ధాలను నిరోధించడం, దురాక్రమణ భావాన్ని నివారించడం.

02/08/2016 - 01:18

శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ సంప్రదాయాల పరిరక్షణ పట్ల కేరళ ప్రభుత్వం కటిబద్ధతను ప్రకటించడం మత స్వేచ్ఛా పరిరక్షణకు దోహదం చేయగల పరిణామం. ఈ దేశపు వౌలిక జాతీయ తత్వమైన హిందుత్వం అనాదిగా మత వైవిధ్యాల భాషా వైవిధ్యాల సంపుటం...అందువల్ల మత స్వేచ్ఛ మనదేశ జనజీవన స్వభావమై ఉంది. క్రీస్తుశకం 1950లో అమలు లోకి వచ్చిన రాజ్యాంగం ఈ సమష్టి జన జీవన స్వభావానికి మరో ధ్రువీకరణ.

02/05/2016 - 23:33

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి వికాసానికి హైదరాబాద్ మహానగర పాలిక-జిహెచ్‌ఎమ్‌సి- ఎన్నికల ఫలితాలు పరాకాష్ఠ. తెలంగాణ రాష్ట్ర సమితి-తెరాస- ఈ స్ఫూర్తికి ప్రతీక. జిహెచ్‌ఎమ్‌సి ఎన్నికలలో సాధించిన ఘన విజయంతో తెరాస ప్రభావం తెలంగాణ రాష్టమ్రంతటా సర్వ సమగ్రంగా ప్రస్ఫుటిస్తోంది. తెలంగాణ రాష్ట్ర సాధన తెరాస వల్ల మాత్రమే సాధ్యమైందన్న వాస్తవం పట్ల ప్రజల విశ్వాసం జిహెచ్‌ఎంసి ఎన్నికల ఫలితాల ద్వారా మరో సారి ధ్రువపడింది.

02/05/2016 - 05:52

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని ఎనిమిదవ సెక్షన్ గురించి మళ్లీ చర్చ మొదలు కావడానికి ప్రధాన కారణం హైదరాబాద్ పాతబస్తీలో మంగళవారం చెలరేగిన హింసాకాండ. మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీ-ఎమ్‌ఐఎమ్-కు చెందిన పార్లమెంటు సభ్యుడు, శాసన సభ్యులు స్వయంగా ప్రత్యర్థి రాజకీయ పక్షాలపై దాడులు చేయడానికి తెగబడడం ప్రజాస్వామ్య రాజ్యాంగ సూత్రాలను అపహాస్యం చేసిన విపరిణామం.

Pages