విహంగాల విడిది
వణికించే చలిగాలుల్ని కాసేపు తట్టుకుని మనం ముందుకు కదిలితే చాలు.. మనోహరమైన ప్రకృతికి మరిన్ని సోయగాలను తెచ్చే అరుదైన పక్షులు ఎనె్నన్నో.. సూర్యోదయానికి ముందుగా అక్కడికి వెళితే వెలుగు రేకలు విచ్చుకునే వేళ రంగురంగుల పక్షులు మన కళ్లెదుట ఇంద్రధనుస్సులను ఆవిష్కరిస్తాయి. గుజరాత్లోని నల్సరోవర్ సరస్సు తీరాన చల్లటి వాతావరణంతో పాటు అక్కడి వేలాది పక్షులు మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి.










