S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

01/30/2020 - 23:09

దుబాయ్, జనవరి 30: దక్షిణాఫ్రికాలోని పొచెస్ట్‌రూమ్‌లో జరుగుతున్న అండర్-19 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో భాగంగా భారత్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించిన ఆస్ట్రేలియా ఓపెనర్‌కు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) పెనాల్టీ విధించింది. భారత పేసర్ ఆకాశ్ సింగ్‌ను ఉద్దేశపూర్వకంగానే మోచేతితో పొడిచాడని ఆసీస్ ఓపెనర్ శామ్ ఫానింగ్‌పై ఫీల్డ్ అంపైర్లు ఫిర్యాదు చేశారు.

01/30/2020 - 23:07

న్యూఢిల్లీ, జనవరి 30: టోక్యో ఒలింపిక్స్‌లో ఆడతానని భారత బాడ్మింటన్ స్టార్ కిడాంబి శ్రీకాంత్ ధీమా వ్యక్తం చేశాడు. గత ఆరు నెలలుగా ఫిట్నెస్ సమస్యతోపాటు, ఫామ్‌ను కోల్పోవడం కూడా తనను వేధించిందని గురువారం పీటీఐతో మాట్లాడుతూ చెప్పాడు. నిజానికి ఈ ఆరు నెలలు తనకు అత్యంత క్లిష్టంగా తోచామని అన్నాడు.

01/29/2020 - 23:45

హామిల్టన్: న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20 లో భారత్ ఘన విజయం సాధించింది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది. ఆఖరు బంతిని సిక్సర్‌గా మలిచి టీమిండియాకు ఓపెనర్ రోహిత్ శర్మ అద్భుత విజయాన్ని అందించాడు. అంతకు ముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని అందించారు.

01/29/2020 - 23:41

ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో భాగంగా బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో స్పెయిన్ ఆటగాడు రాఫెల్ నాదల్‌ను ఓడించిన అనంతరం ఆస్ట్రేలియా క్రీడాకారుడు డొమినిక్ థీమ్ విజయానందం.

01/29/2020 - 06:14

హామిల్టన్ : వరుస విజయాలను సొంతం చేసుకుంటున్న కోహ్లీసేన మరో సిరీస్ విజయంపై కనే్నసింది. న్యూజిలాండ్‌పై పొట్టి ఫార్మాట్‌లో ఇప్పటివరకు సిరీస్ విజయం సాధించలేని భారత్‌కు ఈసారి ఆ అవకాశమొచ్చింది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా టీమిండియా ఇప్పటికే మొదటి రెండు మ్యాచ్‌ల్లో ఘన విజయం సాధించింది. నేడు జరిగే మూడో మ్యాచ్ లోనూ కోహ్లీసేన గెలిస్తే మొదటిసారి న్యూజిలాండ్‌పై టీ20 సిరీస్ గెలిచినట్లవుతుంది.

01/29/2020 - 06:17

రాజమహేంద్రవరం, జనవరి 28: రాజమహేంద్రవరంలోని గోదావరి ఆర్చరీ అకాడమీలో శిక్షణ పొందిన క్రీడాకారులు ఆగ్రా నగరంలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటారని సంస్థ వ్యవస్థాపకుడు యూఎస్‌ఏ లెవెల్-2 అర్చరీ కోచ్ నాళం దుర్గారామ్‌కుమా ర్ తెలిపారు.

01/29/2020 - 06:11

హైదరాబాద్, జనవరి 28: రాజస్థాన్‌తో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టుకు మొదటి రోజు 137 పరుగుల ఆధిక్యం లభించింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ 171 పరుగులకే ఆలౌటైంది. వికెట్ కీపర్ కొల్ల సుమంత్ (51) మాత్రమే అర్ధ సెంచరీతో రాణించాడు. అనికేత్ చౌదరి, రితురాజ్ సింగ్‌లు మూడేసి వికెట్లు తీసుకోగా, తన్వీర్ ఉల్ హక్, ఎస్కే శర్మ, మహిపాల్ లామ్‌రార్‌లు ఒక్కో వికెట్ పడగొట్టారు.

01/29/2020 - 06:10

*చిత్రం... ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో భాగంగా మంగళవారం కెనడాకు చెందిన మిలోస్ రానిక్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో విజయం సాధించిన సెర్బియా ఆటగాడు నోవాక్ డికోవిచ్.

01/29/2020 - 06:08

*చిత్రం... ఆస్ట్రేలియన్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో యూఎస్ ఆటగాడు టెన్నిస్ శాండ్‌గ్రేన్‌పై విజయం సాధించిన అనంతరం స్విట్జర్లాండ్ క్రీడాకారుడు రోజర్ ఫెదరర్.

01/28/2020 - 06:06

లాస్‌ఏంజెల్స్: హెలికాప్టర్ కూలిపోయిన దుర్ఘటనలో తొమ్మిది మంది మృత్యువాత పడగా, మృతుల్లో మాజీ దిగ్గజ బాస్కెట్ బాల్ (ఎన్‌బీఏ) క్రీడాకారుడు కోబె బ్రియాంట్ (41), అతని 13 ఏళ్ల కుమార్తె కూడా ఉన్నారు. లాస్‌ఏంజెల్స్ అధికారులు ఆదివారం ఇక్కడ ఈ విషయాన్ని ధ్రువీకరించారు.

Pages