S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

09/04/2018 - 01:41

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌లో జరుగుతున్న ఆర్‌ఎస్‌ఎల్ ఖర్కివ్ అంతర్జాతీయ చాలెంజ్ ట్రోఫీలో భారత యువ షట్లర్లు అద్భుత విజయాలు సొంతం చేసుకున్నారు. మిక్స్‌డ్ డబుల్స్, పురుషుల డబుల్స్‌లో అనుష్క పరేఖ్, సౌరభ్ శర్మ, కృష్ణప్రసాద్ గరగ, ధృవ్ కపిల విజయాలు నమోదు చేశారు.

09/04/2018 - 01:26

లండన్, సెప్టెంబర్ 3: ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్, టెస్ట్ క్రికెట్‌లో ఇంగ్లాండ్ జట్టులోనే అత్యధిక పరుగులు సాధించిన అలిస్టర్ కుక్ త్వరలో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నాడు. భారత్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా చిట్టచివరిదైన ఐదో టెస్ట్ మ్యాచ్ పూరె్తైన వెంటనే రిటైర్మెంట్ ప్రకటించనున్నాడు. 33 ఏళ్ల కుక్ 161 టెస్టుల్లో 12,254 పరుగులు చేశాడు. 32 శతకాలు, 56 అర్ధ శతకాలు సాధించాడు.

09/04/2018 - 01:24

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: ఆసియా గేమ్స్‌లో స్వర్ణం సాధించలేకపోయామన్న బాధకు, అక్కడ సాధించిన కాంస్యమో, పాకిస్తాన్‌పై విజయమో విరుగుడు కాదని భారత హాకీ కెప్టెన్ పిఆర్ శ్రీజేష్ వ్యాఖ్యానించాడు. నిర్ణీత సమయంలో మ్యాచ్ ఫలితం తేలకపోవడంతో, షూటాఫ్‌కు వెళ్లిన సెమీఫైనల్స్ మ్యాచ్‌లో మలేసియా జట్టుపై భారత్ ఓటమి తెలిసిందే.

09/03/2018 - 02:04

సౌతాంఫ్టన్: సౌతాంఫ్టన్ సాక్షిగా టెస్ట్ సిరీస్ ఇంగ్లాండ్ వశమైంది. 60 పరుగుల ఆధిక్యంతో నాల్గవ టెస్ట్ మ్యాచ్‌ను సొంతం చేసుకున్న ఇంగ్లాండ్, ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను సాధించింది. మలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ నిర్దేశించిన 245 లక్ష్యాన్ని అధిగమించడంలో టీమిండియా పూర్తిగా విఫలమై, 184 పరుగులకే ఆలౌటైంది.

09/03/2018 - 01:41

సౌతాంఫ్టన్, సెప్టెంబర్ 2: ఇంగ్లాండ్‌తో నాల్గవ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పూర్ పెర్ఫార్మెన్స్‌పై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఛెతేశ్వర్ పూజారా దన్నుగా నిలబడ్డాడు. జాస్‌బట్లర్ అర్థ శతకంతో ఇంగ్లాండ్ 233 ఆధిక్యానికి చేరడం తెలిసిందే. మరోపక్క మొయిన్ అలీ ఐదు వికెట్లు తీసి భారత్‌ను పూర్తిగా నిలువరించాడు.

09/03/2018 - 01:59

జకార్తా, సెప్టెంబర్ 2: ఉపఖండం క్రీడాసంరంభంలో భారత ఆకాంక్ష నెరవేరిందనడానికి కేవలం స్వర్ణాల సంఖ్యే ప్రామాణికం కాకపోవచ్చు. దశాబ్దాలుగా అసాధ్యమనుకున్న క్రీడాంశాల్లో ‘స్వర్ణ్భేరి’ మోగించిన అథ్లెట్ల ధీరోదాత్తత మాత్రం కచ్చితంగా భవిష్యత్ క్రీడాతరాలకు కొత్త ఊపిరే. కామనె్వల్త్‌కంటే ఆసియా క్రీడాసంరంభంలో భారత్ మరో మెట్టెక్కిందని చెప్పడానికి పట్టికలో పదిలమైన స్థానం చాలు.

09/02/2018 - 01:37

డెహ్రాడూన్, సెప్టెంబర్ 1: ఉత్తరాఖండ్ అభివృద్ధికి 20 వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆశిస్తున్నామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ తెలిపారు. భారీ ఎత్తున పెట్టుబడులను రాబట్టేందుకు వీలుగా అక్టోబర్ 7-8 తేదీల్లో ఈ సదస్సును నిర్వహించనున్నట్టు ఆయన పేర్కొన్నారు.

09/02/2018 - 02:03

సౌతాంఫ్టన్, సెప్టెంబర్ 1: భారత్- ఇంగ్లాండ్ మధ్య నాలుగో టెస్ట్ 3వ రోజు ఆటను ఇంగ్లాండ్ నిలకడగా సాగించింది. ఆట నిలిపివేసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 260 పరుగులు సాధించి, 233 పరుగుల ఆధిక్యంలో ఉంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి క్రీజులోవున్న అలిస్టర్ కుక్, కీటన్ జిన్నింగ్స్ రెండో ఇన్నింగ్స్ కొనసాగించారు.

09/02/2018 - 02:05

జకార్తా, సెప్టెంబర్ 1: ఉప ఖండం క్రీడా సంరంభం ముగింపు సమయంలో భారత్ మెరుపులు మెరిపించింది. ఒకేరోజు రెండు స్వర్ణాలు కైవసం చేసుకుని పతకాల పట్టికలో 8వ స్థానాన్ని నిలుపుకుంది. అంతా ఊహించినట్టే మిడిల్ వెయిట్ బాక్సింగ్‌లో భారత్ స్టార్ బాక్సర్ అమిత్ ఫంగల్ (49కేజీ) భారత్‌కు స్వర్ణాన్ని అందించాడు. భారత బాక్సింగ్ జట్టునుంచి ఫైనల్‌కు చేరింది 22ఏళ్ల ఆర్మీ కుర్రాడు అమిత్ ఒక్కడే.

09/01/2018 - 01:48

సౌతాంప్టన్: 51 శాతం బంతులు.. 48 శాతం పరుగులు. భారత్- ఇంగ్లాండ్ మధ్య సౌతాంఫ్టన్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో ఛెతేశ్వర్ పూజారా బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌కు ఇది పరాకాష్ట. 247 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 84.5 ఓవర్లలో 273 పరుగులు చేసి 27 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. రెండో రోజు శుక్రవారం 19 పరుగులతో భారత్ నైట్‌వాచ్‌మెన్లు శిఖర్ ధావన్, లోకేష్ రాహుల్ ఆట మొదలుపెట్టారు.

Pages