-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
లండన్, జూలై 15: వింబుల్డన్ ఫురుషుల ఫైనల్ వన్సైడ్గా సాగిపోయింది. అంతా ఊహించిన ఆటగాడే మ్యాచ్ మొత్తం చెడుగుడు ఆడేశాడు. బలమైన నెట్స్, ఫోర్హ్యాండ్ షాట్స్తో ప్రత్యర్థిని బెంబేలెత్తించాడు. నాల్గవ వింబుల్డన్ టైటిల్తోపాటు, 13వ గ్రాండ్శ్లామ్ కిరీటాన్నీ నెత్తికెత్తుకున్నాడు. అతనెవరో కాదు.. 31ఏళ్ల సెర్బియా ఆటగాడు నొవాక్ జకోవిచ్. అద్భుతమేదో జరగొచ్చని ఆశపడిన ఆండర్సన్ ఆరాటం నొవాక్ ముందు నిలవలేదు.
లండన్, జూలై 15: బ్యాకప్ పార్టనర్గా తనకు తనే సాటి అని నిరూపించుకున్నాడు మైక్ బ్రేయన్. వింబుల్డన్ పురుషుల డబుల్స్లో 17వసారి గ్రాండ్స్లామ్ను సొంతం చేసుకుని సత్తా చాటుకున్నాడు. అయితే, ఈసారి బ్రేయన్ భాగస్వామిగా అతని సోదరుడు బాబ్ లేకపోవడం ఓ సెనే్సషన్ అయితే, రెండే రెండు టోర్నీల్లో కలిసి ఆడిన జాక్సోక్తో జతకట్టడం మరో సెనే్సషన్.
బ్యాంకాక్, జూలై 15: భారత స్టార్ షట్లర్ సింధు మళ్లీ ఓడింది. ఈ ఏడాది ఒక్క టోర్నమెంట్లోనూ శుభారంభం లేకుండా వైఫల్యాలను కొనసాగిస్తోంది. మొన్న మలేసియా.. నిన్న ఇండోనేషియా.. ఇప్పుడు థాయ్లాండ్. పోరాడి ఫైనల్కు చేరుకుని టైటిల్ సొంతం చేసుకోవాలనుకున్న సింధు ఆశలకు జపాన్ షట్లర్ నజొమి ఒకుహరా బ్రేక్ వేసింది.
న్యూఢిల్లీ, జూలై 15: సెర్బియాలో జరుగుతున్న 36వ గోల్డెన్ గ్లోవ్ యూత్ బాక్సింగ్ టోర్నీలో భారత బాక్సర్ల హవా నడుస్తోంది. ప్రతిష్టాత్మక టోర్నీలో 13మంది భారత బాక్సర్లు ఫైనల్కు చేరుకున్నారు. వీరిలో ఆరుగురు మహిళలు.
లండన్, జూలై 15: సాధించిన ఘనత కంటే శాపనార్థాలే మహేంద్రుడిని ఇబ్బందిపెట్టాయి. ఇంగ్లాండ్తో ఆడిన రెండో వనే్డలో పదివేల పరుగుల మైలురాయిని సాధించి రికార్డు సృష్టించాడు రన్నింగ్ మెషీన్ ధోనీ. ఆ ఘనతను కీర్తించకుండా, మ్యాచ్ ఓటమికి మహేంద్రుడే కారణమంటూ క్రికెట్ అభిమానులు వేలెత్తిచూపడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు.
మాస్కో, జూలై 15: ఒకపక్క హాట్ ఫేవరిట్ క్రొయేషియా... మరోపక్క రెండోసారి కప్ను చేజిక్కించుకోవాలన్న పట్టుదలతో ఫ్రాన్స్... తుది పోరు ఉత్కంఠగా ప్రారంభమైనా క్రొయేషియా సెల్ఫ్గోల్ మ్యాచ్ తీరునే మార్చేసింది. ఎంత పోరాడినా ఫ్రాన్స్ ధాటిముందు క్రొయేషియా ఆటగాళ్లు డీలా పడ్డారు. దీంతో ఫ్రాన్స్ విశ్వవిజేతగా నిలిచింది. రెండు దశాబ్దాల తర్వాత మరోసారి సాకర్ కప్పును చేజిక్కించుకుంది.
వింబుల్డన్: వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్ను జర్మనీకి చెందిన ఏంజెలిక్ కెర్బర్ దక్కించుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో ఆమె ప్రపంచ మాజీ నంబర్ వన్ సెరెనా విలియమ్స్ను 6-3, 6-3 తేడాతో ఓడించింది. కెరీర్లో 23 గ్రాండ్ శ్లామ్ సింగిల్స్ను కైవసం చేసుకొని, మహిళా టెన్నిస్లో తిరుగులేని క్రీడాకారిణిగా పేరు సంపాదించిన సెరెనా గత ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్ను గెల్చుకుంది.
ఫిఫా ప్రపంచకప్లో ఆదినుంచీ అద్భుతాలు, సంచలనాలు నమోదవుతున్న తరుణంలో ఫ్రాన్స్తో ఫైనల్ ఆడనున్న పసికూన ఎలాంటి సంచలనాన్ని నమోదు చేస్తుందోనన్న ఉత్కంఠ సాకర్ అభిమానులను వెంటాడుతోంది. 68ఏళ్ల చరిత్రలో అనూహ్యంగా ఫైనల్కు చేరిన క్రొయేషియా ఇవాన్ పెరిసిక్, రాకిటిక్లపైనే కొండంత ఆశలు పెట్టుకుంటే, ఫ్రాన్స్ మాత్రం ఎంబప్పె, గ్రీజ్మన్ల చాకచక్యంపై ధీమా వ్యక్తం చేస్తోంది.
మాస్కో, జూలై 14: ప్రపంచకప్కు ఫిట్నెస్సే ప్రామాణికం. ఆ విషయంలో మా ఆటగాళ్లకు ఎలాంటి సందేహాలు లేవు. ప్రపంచకప్ సాధించలేకపోతే, మేం ఫిట్గా లేనట్టేనని వాళ్లే చెబుతున్నారు. అదే నాకు సంతోషం కలిగించే విషయం’ అంటున్నాడు క్రొయేషియా కోచ్ జ్లాట్కో డాలిక్. జట్టులో భారీ మార్పులు, వ్యూహాత్మక ప్రణాళికలతో ఆదివారం ఫ్రాన్స్తో జరగనున్న ప్రపంచకప్ ఫైనల్కు క్రొయేషియా జట్టు సన్నద్ధమైంది.
వింబుల్డన్, జూలై 14: వింబుల్డన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్లో ప్రపంచ నంబర్ వన్ రాఫెల్ నాదల్ సెమీ ఫైనల్లో పరాజయాన్ని ఎదుర్కోగా, 21వ ర్యాంక్ ఆటగాడు, మాజీ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ హోరీహోరీ పోరులో ఫైనల్కు దూసుకెళ్లాడు. వాతావరణం సరిగ్గా లేని కారణంగా శుక్రవారం ఆటను నిలిపివేసే సమయానికి నాదల్పై జొకోవిచ్ 6-4, 3-6, 7-6 ఆధిక్యంలో ఉన్నాడు.