-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
ఇంగ్లాండ్, మే 24: ఇంగ్లాండ్, పాకిస్తాన్ జట్ల మధ్య లండన్లోని లార్డ్స్ మైదానంలో గురువారం ప్రారంభమైన ఐదు రోజుల టెస్టు మ్యాచ్లో భాగంగా తొలిరోజు తొలి ఇన్నింగ్స్లో ఆతిధ్య జట్టు 58.2 ఓవర్లలో 184 పరుగులకే ఆలౌటైంది. పాక్ బౌలర్లలో మహ్మద్ అబ్బాస్, హసన్ అలీ ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ల వెన్ను విరిచారు. ఇరు జట్ల మధ్య ఈ టెస్టు మ్యాచ్ ఈనెల 24 నుంచి 28 వరకు జరుగుతుంది.
న్యూఢిల్లీ, మే 24: త్వరలో జరుగనున్న ఆసియా గేమ్స్లో పోరాడేందుకు ఎలాంటి భయం, బెరుకు లేకుండా పోరాడేందుకు ముందుకు రావాలని 2016 రియో ఒలింపిక్స్ విజేత, ప్రముఖ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్కు కోచ్ బిశే్వశ్వర్ నంది హితవు పలికాడు. రియో ఒలింపిక్స్లో నాలుగో స్థానంలో నిలిచిన 24 ఏళ్ల దీపా ప్రస్తుతం మోకాలి గాయంతో బాధపడుతోంది.
కోల్కతా, మే 24: బ్యాటింగ్ వైఫల్యంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రికెట్ టోర్నీలో కోల్కతా నైట్రైడర్స్తో బుధవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థా రాయల్స్ ఓటమిపాలైందని ఆ జట్టు కెప్టెన్ అజింక్య రహానే స్పష్టం చేశాడు. ఐపీఎల్లో ప్రధాన ఘట్టమైన ఎలిమినేటర్ మ్యాచ్లో తమ జట్టు ఓటమిపాలవడం చాలా బాధేసిందన్నాడు.
న్యూఢిల్లీ, మే 24: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్-11లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు కలిసి రాలేదు. బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్లో రాణించకపోవడంతో ఆర్సీబీ ఈసారి అంతగా రాణించలేక పోయింది. ఆర్సీబీపై పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయి. ఈ సందర్భంగా బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ..
న్యూఢిల్లీ, మే 24: మెడకు తగిలిన గాయం కారణంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్లో జరిగే కౌంటీ చాంపియన్షిప్లో పాల్గొనే అవకాశం లేదు. ఈ విషయాన్ని బీసీసీఐ ధృవీకరించింది. ఈనెల 17న బెంగళూరులో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడిన సమయంలో కోహ్లీ ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో గాయమైంది. అతను పూర్తిగా కోలుకోవడానికి కనీసం మూడు వారాల పాటు విశ్రాంతి అవసరం ఉంటుందని తెలిపింది.
కోల్కతా, మే 23: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చివరి అంకానికి చేరుకుంటున్న తరుణంలో బుధవారం ఇక్కడి ఈడెన్ గార్డెన్స్లో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ 25 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్పై ఘన విజయం సాధించింది.
ప్రెటోరియా, మే 23: దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్మన్, మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ (34) అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పాడు. ఈ అనూహ్య నిర్ణయంపై ఆయన ఒక వీడియో సందేశంలో ట్విటర్ ద్వారా వెల్లడించాడు. ప్రెటోరియాలోని టక్స్ క్రికెట్ క్లబ్లో 14 ఏళ్ల క్రితం యువ క్రికెటర్గా చోటుదక్కించుకున్న తాను ఇప్పటికీ కొనసాగుతున్నానని ఆయన పేర్కొన్నాడు.
బ్యూనోస్ ఎయిర్స్, మే 23: ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో పాల్గొంటున్న ప్రధాన టీమ్లకు మేటి ఆటగాళ్లు ఎదుర్కొంటున్న పలు గాయాల సమస్యలు వారిని టోర్నమెంట్లో పాల్గొనకుండా చేస్తున్నాయి. ఫుట్బాల్ క్రీడా దిగ్గజాలైన అర్జెంటీనా వంటి దేశాలకు చెందిన క్రీడాకారులు సైతం మోకాలు, చీలమండ, వెన్ను నొప్పి వంటి అనేక సమస్యలతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు.
ముంబయి, మే 23: ముంబయి వాంఖడే స్టేడియంలో మంగళవారం చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన ఐపీఎల్ సీజన్లోని తొలి క్వాలిఫయర్ మ్యాచ్లో తమ జట్టు బౌలర్ల బౌలింగ్ తీరును సన్రైజర్స్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అభినందించాడు.
ముంబయి, మే 23: ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో స్లో ఓవర్ రేటు జట్లకు ఓ ప్రధాన సమస్యగా పరిణమించిందని చెన్నై సూపర్ కింగ్స్ హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ అన్నాడు. ముఖ్యంగా వాతావరణంలో వేడి, తేమ వంటి అంశాలు స్లో ఓవర్ రేటుకు కారణమవుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డాడు.