-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
పారిస్, మే 21: రాఫెల్ నాదల్ మళ్లీ నెంబర్ వన్ ర్యాంక్ను అధిరోహించాడు. రోమ్లో జరిగిన ఇటాలియన్ ఓపెన్ టెన్నిస్ టైటిల్ను కైవసం చేసుకోవడం ద్వారా ప్రపంచ ర్యాంకింగ్లో మళ్లీ మొదటి స్థానాన్ని ఆక్రమించాడు. ఈ గెలుపు త్వరలో జరిగే ఫ్రెంచ్ ఓపెన్లో నాదల్ మరింత దూసుకుపోయేందుకు ఉపకరిస్తుంది. రోమ్ మాస్టర్ టైటిల్లో విజయంతో నాదల్ రోజర్ ఫెదరర్ను వెనక్కు నెట్టాడు.
పదకొండో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) గ్రూప్ దశను ముగించుకొని, ప్లే ఆఫ్ మ్యాచ్లకు సిద్ధమైంది. పాయంట్ల పట్టికలో మొదటి రెండు స్థానాలను ఆక్రమించిన జట్లు మొదటి క్వాలిఫయర్లో ఢీ కొంటాయ. అందులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్కు వెళుతుంది. ఓడిన జట్టుకు ఫైనల్ చేరేందుకు మరో అవకాశం ఉంటుంది. మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య ఎలిమినేటర్ ఉంటుంది. అందులో ఓడిన జట్టు నిష్క్రమిస్తుంది.
పుణే, మే 20: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) దశలో చివరి మ్యాచ్లో చెన్నై సూ పర్ కింగ్స్ ఐదు వికెట్ల తేడాతో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ను ఓడించింది. ఒకానొక దశలో చెన్నై ఓటమి ప్రమాదంలో పడినప్పటికీ, సురేష్ రైనా చక్కటి బ్యాటింగ్ ప్రతిభ ఆ జట్టు ను విజయపథంలో నడిపించింది. పంజాబ్ నిర్దేశించిన 154 పరుగుల లక్ష్యాన్ని చెన్నై మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది.
న్యూఢిల్లీ, మే 20: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నుంచి డిఫెండింగ్ చాంపియన్ ముంబయి ఇండియన్స్ నిష్క్రమించింది. ఆదివారం ఢిల్లీ డేర్డెవిల్స్తో జరిగిన తన చివరి గ్రూప్ మ్యాచ్లో ముంబయి 11 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది.
న్యూఢిల్లీ, మే 20: ‘లవ్, లక్ అండ్ బెస్ట్ విషెస్ ఫర్ శ్రీకాంత్’ అని బ్యాట్పై ధోనీ స్వయంగా రాసిన భ్యాట్ను చూసి తెలుగు తేజం ప్రంపచ నెంబర్ 4 బాడ్మింటన్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్ ఆశ్చర్యపోయాడు. ధోనీకి ఒక ప్రత్యేకమైన అభిమాని శ్రీకాంత్. ఇటీవల గోల్డ్ కోస్ట్లో జరిగిన కామనె్వల్త్ క్రీడల్లో శ్రీకాంత్ రజత పతకం సాధించాడు.
డాంగె సిటీ, మే 20: ఇక్కడ జరుగుతున్న మహిళల ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్ రెండో రోజు భారత్కు కలిసిరాలేదు. మొదటి రోజు ఆటలో భారత్ శుభారాంభం చేసిన రెండో రోజు పోటీలకు అతిథ్యమిస్తున్న జట్టు చేతిలో ఓటమి తప్పలేదు. ఆదివారం జరిగిన మ్యాచ్లో నిరూటి విజేత భారత్ 0-1 తేడాతో కోరియా చేతిలో ఓడిపోయింది. ఆట ప్రారంభం నుంచి ఇరు జట్లు క్రీడాకారిణులు అద్భుతంగా ఆడారు.
మాడ్రిడ్, మే 20: ఫ్రెంచ్ మాజీ ఫుట్బాలర్ జినెడిన్ జిదానే కుమారుడు లుకా జిదానే ప్రొఫెషనల్ ఆటగాడిగా అరంగేట్రం చేశాడు. ప్రతిష్ఠాత్మక రియల్ మాడ్రిడ్ తరఫున అతను చాంపియన్స్ లీగ్ సాకర్ టోర్నమెంట్లో భాగంగా విల్లారియల్తో జరిగిన మ్యాచ్లో ఆడాడు.
బ్యాంకాక్, మే 20: పురుషుల విభాగంలో థామస్, మహిళల విభాగంలో ఉబర్ కప్ కోసం ప్రారంభమైన ప్రతిష్ఠాత్మక బాడ్మింటన్ టోర్నీ మొదటి రౌండ్లో భారత్ దారుణంగా విఫలమైంది. థామస్ కప్లో ఫ్రాన్స్ను ఢీకొన్న భారత్ 1-4 తేడాతో పరాజయాన్ని చవిచూస్తే, ఉబర్ కప్లో కెనడాతో తలపడిన మహిళలు కూడా అదే తేడాతో ఓటమిపాలయ్యారు. ఫ్రాన్స్తో భారత్ పోరు పురుషుల సింగిల్స్తో మొదలైంది.
జైపూర్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నాయకత్వంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఈసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో గ్రూప్ దశ నుంచే నిష్క్రమించింది. అత్యంత కీలకమైన మ్యాచ్ని గెల్చుకున్న రాజస్తాన్ రాయల్స్ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా నిలబెట్టుకుంది. ప్రత్యర్థి ముందు కేవలం 165 పరుగుల లక్ష్యానే్న ఉంచినప్పటికీ, పకడ్బందిగా బౌలింగ్ చేసి, బెంగళూరును 134 పరుగులకే కట్టడి చేసింది.
న్యూఢిల్లీ, మే 19: ఈసారి ఐపీఎల్లో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగినప్పటికీ, పేలవమైన ప్రదర్శనలతో, నిలకడలేని ఆటతో అభిమానులను నిరాశపరుస్తున్న ముంబయి ఇండియన్స్ ప్లే ఆఫ్కు చేరడమే ధ్యేయంగా ఆదివారం ఢిల్లీ డేర్డెవిల్స్తో జరిగే మ్యాచ్లో సర్వశక్తులు ఒడ్డనుంది. రోహిత్ శర్మ నాయకత్వంలోని ముంబయిలో ఎంతో మంది స్టార్లు ఉన్నారు. స్వయంగా రోహిత్ మంచి బ్యాట్స్మన్.