-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
కనాచి, మే 18: క్రికెట్ నుంచి పూర్తిగా వైదొలిగే ప్రశే్న లేదని పాక్ ఆల్రౌండర్ షాహిద్ అఫ్రిదీ స్పష్టం చేశాడు. మొకాలు గాయం నుంచి కోలుకుంటున్న 38 ఏళ్ల అఫ్రిదీ ట్విట్టర్ అకౌంట్లో భవిష్యత్తుపై తన ఆభిప్రాయాలను వెల్లడించాడు. టీ-20 లీగ్స్లో ఆడతానని చెప్పాడు. దుబాయ్లో జరిగే పాకిస్తాన్ సూపర్ లీగ్సహా ఈ ఫార్మాట్లో జరిగే అన్ని పోటీల్లోను ఆడాలనుకున్నట్టు తెలిపాడు.
న్యూఢిల్లీ, మే 18: మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ స్మారక ఉపన్యాసం ఇచ్చే అవకాశాన్ని ఇంగ్లాండ్ మాజీ ఆల్రౌండర్ కెవిన్ పీటర్సన్కు అప్పగించడంపై తీవ్ర దుమారం రేగుతున్నది. వచ్చేనెల 12ను బెంగళూరులో జరిగే ఈ కార్యక్రమంలో ప్రసంగించేందుకు కుమార సంగక్కర, నాసర్ హుస్సేన్, సౌరవ్ గంగూలీ పేర్లను కూడా పరిశీలించారు.
బెంగళూరు, మే 18: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రికెట్ టోర్నమెంట్లో ఆడిన అనుభవం తనకు ఇకముందు ఆడే వనే్డల్లో ఎంతో ఉపయోకరంగా ఉంటుందని ఇంగ్లాండ్ ఆల్రౌండర్ మోయన్ అలీ అన్నాడు. ఇటీవల పాకిస్తాన్పై టెస్టు సిరీస్కు ఎంపికైన ఇంగ్లాండ్ జట్టులో స్థానం సంపాదించుకోలేకపోయన అతను ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున బరిలోకి దిగాడు.
లాస్ ఏంజిల్స్: అమెరికా సూపర్ స్విమ్మర్ కాటీ లెడెకీ ఈత కొలనులో తనకు తిరుగులేదని మరోసారి నిరూపించింది. మహిళల 1,500 మీటర్ల ఫ్రీస్టయిల్లో తన రికార్డును తానే అధిగమించి, కొత్త రికార్డుతో సంచలనం సృష్టించింది. లండన్ ఒలింపిక్స్లో 800 మీటర్ల ఫ్రస్టయిల్లో స్వర్ణ పతకాన్ని అందుకోవడం ద్వారా యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించిన కాటీ రియో ఒలింపిక్స్లో నాలుగు స్వర్ణాలు, ఒక కాంస్య పతకాన్ని గెల్చుకుంది.
న్యూఢిల్లీ, మే 17: ఏదైనా క్రికెట్ మ్యాచ్ మొదలు పెట్టడానికి ముందు టాస్ వేయడం ఆనవాయితీగా వస్తున్నది. అయితే, ఇకపై టెస్టు క్రికెట్లో టాస్ ఉండాలా? లేదా? అనే అంశంపై ఇటీవల కాలంలో వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఈ పరిణామాన్ని దృష్టిలో ఉంచుకొని, ముంబయిలో ఈనెల 28, 29 తేదీల్లో సమావేశం కానున్న ఐసీసీ క్రికెట్ కమిటీ టాస్పైనే ప్రధానంగా చర్చించనుంది.
న్యూఢిల్లీ, మే 17: ‘ఖేలో ఇండియా’ ప్రణాళికలో భాగంగా మొట్టమొదటి జాతీయ పారాగేమ్స్ బెంగళూరులో జరగనున్నాయి. జూన్ 28 నుంచి జూలై 7వ తేదీ వరకు జరిగే ఈ పోటీల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన పారా అథ్లెట్లు బరిలోకి దిగుతారని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ జాయ పారాగేమ్స్ హ్యాండ్బుక్లో తెలిపింది.
న్యూఢిల్లీ, మే 17: క్రమశిక్షణా రాహిత్యంతో ఫొగట్ సిస్టర్స్ సమస్యను కొని తెచ్చుకున్నారు. ఆసియా క్రీడలకు సిద్ధమయ్యేందుకు ఇక్కడ ఏర్పాటు చేసిన శిబిరం నుంచి అధికారులు వారికి ఉద్వాసన పలికారు. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యుఎఫ్ఐ) ప్రకటించిన ప్రాబబుల్స్ జాబితాలో ఫొగట్ సిస్టర్స్ సంగీత, గీత, రీతూ, బబిత కూడా ఉన్నారు.
బెంగళూరు, మే 17: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఈసారి నాకౌట్ చేరదేమోనన్న పరిస్థితిని ఎదుర్కొంటున రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఊరట లభించింది. గురువారం టేబుల్ టాపర్ సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన కీలక మ్యాచ్లో ఈ జట్టు 14 పరుగుల తేడాతో గెలిచింది. మొత్తమీద ఆరో విజయంతో 12 పాయంట్లు సంపాదించిన బెంగళూరు నాకౌట్లో చోటుకోసం ముంబయ ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్లతో పోటీపడుతోంది.
సిడ్నీ, మే 17: దక్షిణాఫ్రికా టూర్లో మూడో టెస్టు ఆడుతున్నప్పుడు, బాల్ ట్యాంపరింగ్కు వూహరచన చేసినట్టు రుజువుకావడంతో ఏడాది సస్పెన్షన్ను ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియా సీనియర్ క్రికెటర్, ఓపెనర్ డేవిడ్ వార్నర్ క్లబ్ క్రికెట్లో ఆడడం ద్వారా కెరీర్లో రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించనున్నాడు. సిడ్నీకి చెందిన రాండ్విక్ పెటెర్షమ్ క్రికెట్ క్లబ్ తరఫున ఆడేందుకు సిద్ధమయ్యాడు.
న్యూఢిల్లీ, మే 17: ముంబయి వాంఖడే స్టేడియంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మొదటి క్వాలిఫయర్కు ముందు ఈనెల 22న మహిళల టీ-20 మ్యాచ్ని నిర్వహించాలని నిర్ణయించిన భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీ) పోటీపడే రెండు జట్లను ఖరారు చేసింది. భారత్తోపాటు, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ దేశాలకు చెందిన మహిళా క్రికెటర్లు ఈ మ్యాచ్లో దర్శనమివ్వనున్నారు.