-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
పుణె, మే 13: హైదరాబాదీ క్రికెటర్ అంబటి రాయుడు చెలరేగిపోయాడు. సిక్సర్లు, ఫోర్లతో హోరెత్తించాడు. ఓపెనర్ గా వచ్చి నాటౌట్గా నిలిచి చెన్నైకి అలవోక విజయాన్ని అం దించాడు. సన్రైజర్స్ బౌలర్లను ఆటాడుకున్నాడనే చెప్పాలి. పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఆదివారం జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో సునాయసంగా సన్రైజర్స్ హైదరాబాద్పై విజయం సాధించింది.
ముంబయి, మే 13: ఐపీఎల్లో భాగంగా ఆదివారం ముంబయి ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక్కడి వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్లో ఓపెనర్ ఎవిన్ లివీస్ నిలకడగా ఆడి అర్థ సెంచరీ సాధించడంతో పాటు వికెట్ కీపర్ బట్లర్ (94 పరుగులు) రాణించడంతో ముంబయి ఇండియన్స్పై 7 వికెట్ల తేడాతో రాజస్థాన్ విజయం సాధించి ప్లే ఆఫ్ ఆశలు సజీవం చేసుకుంది.
డబ్లిన్, మే 13: మాలాహైడ్లో పాకిస్తాన్తో జరుగుతున్న ఆరురోజుల టెస్ట్ మ్యాచ్లో ఐర్లాండ్ ఇన్నింగ్స్ దారుణంగా ప్రారంభమైంది. ఆదివారం లంచ్ సమయానికి ఐదు పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి కోలుకోలేని కష్టాల్లో కూరుకుపోయింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్లో పాకిస్తాన్ 310 పరుగులకు డిక్లేర్ చేసింది.
ఇండోర్, మే 13: ప్రస్తుత ఐపీఎల్లో దాదాపు నిష్క్రమణ దశలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు సోమవారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుతో జరిగే మ్యాచ్లో తప్పనిసరిగా గెలవాలి. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టులోని బలహీనతలను సొమ్ము చేసుకునే దిశగా యత్నిస్తే తప్ప ఆర్సీబీకి విజయం నల్లేరుపై బండి నడక కాబోదు.
మాస్కో, మే 13: ప్రపంచ కప్ ఫుట్ బాల్ పోటీలకు ఇంకా నెలరోజుల సమయం మాత్రమే ఉంది. రాజకీయంగా పశ్చిమ దేశాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రష్యా తన సూపర్ పవర్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు, ఫుట్బాల్ను ఒక ఆయుధంగా ఉపయోగించుకోవడానికి తీవ్రంగా కృషి చేస్తోంది.
ఇండోర్, మే 12: కింగ్స్ ఎలెవెన్ పంజాబ్తో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ ఘన విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచిన పంజాబ్ బౌలింగ్ను ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్కు దిగిన కోల్కతా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 245 పరుగులు చేసింది. ప్రత్యర్థి జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 214 పరుగులు మాత్రమే చేయగలిగింది.
కరాచి, మే 12: పాకిస్థాన్కు చెందిన ప్రముఖ హాకీ గోల్గీపర్ మన్సూర్ అహ్మద్ (49) కన్నుమూసారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కార్డియోవాస్కులర్లో చికిత్స పొందుతున్న ఆయన శనివారం మధ్యాహ్నం గుండె సంబంధిత సమస్యతో మృతి చెందారు. ఆయన మృతికి పాకిస్థాన్ హాకీ ఫెడరేషన్ సంతాపం వ్యక్తం చేసింది. ఇంత చిన్నవయసులోనే అతని మృతి చెందడం హాకీ రంగానికి తీరని లోటని పేర్కొంది.
న్యూఢిల్లీ, మే 12: బెంగళూరు ఖాతాలో మరో విజయం నమోదైంది. ఇక్కడి ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ డేర్ డెవిల్స్పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. విరాట్ కోహ్లీ కెప్టెన్సీ ఇన్నింగ్తో ఆడగా, మరో క్రికెటర్ ఏబీ డివిలియర్స్ సైతం జూలు విదిల్చాడు. ఢిల్లీ డేర్ డెవిల్స్ క్రికెటర్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ శ్రమ వృథా అయింది.
పుణె, మే 12: ప్లే ఆఫ్లో బెర్త్ ఖాయం చేసుకోవడానికి సన్రైజర్స్ హైదరాబాద్తో ఆదివారం జరిగే పోరులో గెలవడానికి చెన్నై సూపర్కింగ్స్ తహతహలాడుతోంది. హైదరాబాద్ జట్టు ఇప్పటికే ప్లే ఆఫ్కు చేరుకుంది. ఒక పక్క బౌలింగ్, మరో పక్క బ్యాటింగ్తో ప్రత్యర్థి జట్టు ఎలాంటిదైనా మ్యాచ్ ఆఖరి నిమిషంలో సైతం విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంటున్న సన్రైజర్స్ అప్రతిహతంగా దూసుకుపోతోంది.
ముంబయి, మే 12: ప్రస్తుత ఐపీఎల్ సీజన్లోని మొత్తం ఎనిమిది జట్లలో నాలుగో స్థానంలో ఉన్న ముంబయి ఇండియన్స్, ఆరో స్థానంలో నిలిచిన రాజస్తాన్ రాయల్స్ జట్ల మధ్య ఆదివారం హోరాహోరీ పోరు జరగనుంది. రెండు జట్లూ ప్లేఆఫ్కు చేరాలంటే తాము ఆడబోయే మిగిలిన కనీసం రెండు, మూడు మ్యాచ్లలో విజయం సాధించాల్సి ఉంటుంది. ముంబయి, రాజస్తాన్ ఇంతవరకు 11 మ్యాచ్లు ఆడగా ఐదింట్లో విజయం, మరో ఆరింట్లో పరాజయం పాలయ్యాయి.