S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

05/12/2018 - 01:54

విజయవాడ, మే 11: రాష్ట్ర ప్రతిష్ఠను అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడింప చేయాల్సిన క్రీడా సంఘాలు వ్యక్తిగత, స్వార్థ రాజకీయాలతో అభాసుపాలవుతున్నాయి. ఓవైపు ఆర్చరీ క్రీడాకారులు వ్యక్తిగత మనస్పర్థలతో రోడ్డెక్కి ఆర్చరీ క్రీడను అభాసుపాలు చేస్తుంటే తాజాగా కబడ్డీ అసోసియేషన్‌లో ఎప్పటి నుంచో కొనసాగుతున్న లుకలుకలు రోడ్డెక్కాయి.

05/12/2018 - 01:52

జైపూర్, మే 11: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా శుక్రవారం ఇక్కడి సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ముందుగా బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది.

05/12/2018 - 01:50

న్యూఢిల్లీ, మే 11: ప్లే-ఆఫ్ వేటలో ఇప్పటికే వెనుకబడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ), ఇప్పటికైనా పరిస్థితులకు అనుగుణంగా మారితే తప్ప ప్రయోజనం ఉండబోదు. శనివారం ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో ఢీకొనబోతున్న ఆర్‌సీబీ, ఈ మ్యాచ్‌ను తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది.

05/12/2018 - 01:46

హైదరాబాద్, మే 11: ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ (ఐపీఎల్)ను తెలుగు కామెంటరీ ప్రజలకు మరింత చేరువ చేస్తుందని భారత ఆల్‌రౌండర్, కామెంటేటర్ వేణుగోపాల్ రావు అన్నాడు. గతంతో పోలీస్తే తెలుగు రాష్ట్రాల్లో ఐపీఎల్ మ్యాచ్‌లను చూస్తున్న వారి సంఖ్య పెరిగిందని ఆంధ్రభూమితో మాట్లాడారు. క్రికెటర్‌గా మైదానంలో మ్యాచ్ ఆడటం ఒక ఎత్తయతే.. కామెంటేటర్‌గా మ్యాచ్‌ను విశే్లషించడం మరో ఎత్తని చెప్పాడు.

05/12/2018 - 01:45

న్యూఢిల్లీ, మే 11: ఒలింపిక్స్ పతక సాధన లక్ష్యంగా అమలు చేస్తున్న టార్గెట్ ఒలింపిక్ సోడియం స్కీమ్ (టాప్స్) ఎంతో ఆదరణ పొందుతుంది. వివిధ క్రీడాంశాల్లో ఆటగాళ్లు చూపే ప్ర తిభ ఆధారంగా ఈ స్కీంలో చోటు కల్పిస్తారు. ఈ క్రమంలో తా జాగా టాప్స్ నుంచి ఏస్ షూటర్ గగన్ నారంగ్, వెయిట్ లిఫ్టర్ రాగాల వెంకట రాహుల్‌లను తొలింగించింది.

05/12/2018 - 01:42

ముంబయి, మే 11: ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో పాల్గొనకుండా కౌంటీ క్రికెట్‌లో ఆడాలని విరాట్ కోహ్లీ తీసుకున్న నిర్ణయాన్ని మాజీ క్రికెట్ క్రీడాకారుడు దిలీప్ వెంగ్‌సర్కార్ సమర్థించాడు. వచ్చేనెలలో ఇంగ్లండ్ టూర్‌కు వెళుతున్న నేపథ్యంలో, కౌంటీ క్రికెట్‌లో ఆడటం వల్ల ప్రయోజనం ఉంటుందన్నాడు. భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య మొత్తం ఐదు టెస్ట్ సిరీస్ మ్యాచ్‌లు జరుగనున్నాయి.

05/12/2018 - 01:40

న్యూఢిల్లీ: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లు గురువారం అర్ధరాత్రి ఢిల్లీలోని విరాట్ కోహ్లీ రెస్టారెంట్ అయనా నూయేవాలో సందడి చేశారు. శనివారం ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో మ్యాచ్‌కు ఢిల్లీకి చేరుకున్న ఆటగాళ్లకు రెస్టారెంట్‌లో కోహ్లీ విందు ఏర్పాటు చేశారు. ఆటగాళ్లతో సెల్ఫీలు దిగేందుకు కస్టమర్లు పోటీ పడగా, క్రికెటర్లు కూడా సరదాగా వారితో ఫొటోలు దిగేందుకు ఆసక్తి కనబరిచారు.

05/11/2018 - 01:44

న్యూఢిల్లీ, మే 10: బ్యాంకాక్‌లో ఈనెల 20వ తేదీ నుంచి 27వ తేదీ వరకు నిర్వహించనున్న ప్రపంచ బాడ్మింటన్ సమాఖ్య (బీఎఫ్‌డబ్ల్యూ) థామస్, ఉబెర్ కప్‌లలో పాల్గొనే భారత మహిళల జట్టుకు సైనా నెహ్వాల్, పురుషుల జట్టుకు హెచ్.ఎస్.ప్రణయ్ నాయకత్వం వహించనున్నారు. ఈ విషయాన్ని బా డ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండి యా వెల్లడించింది.

05/11/2018 - 01:43

ైపూర్, మే 10: ఇప్పటివరకు వరుస పరాజయాలతో కునారిల్లుతున్న రాజస్థాన్ రాయల్స్, శుక్రవారం దిగ్గజ చెన్నై సూపర్ కింగ్స్‌ను ఢీకొనబోతున్నది. అత్యధిక పరాజయాలు మూటకట్టుకున్న రాజస్థాన్ రాయల్స్‌కు ఈ మ్యాచ్ తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది.

05/11/2018 - 01:22

న్యూఢిల్లీ, మే10: జాతీయ ఫూట్‌బాల్ కోచ్ స్టీఫెన్ కాన్‌స్టాంటైన్, 30 మంది ఫూట్‌బాల్ క్రీడాకారులను ప్రిపరేటరీ క్యాంప్‌కు రావాల్సిందిగా ఆదేశించారు. జూన్ 1 నుంచి ముంబయి లో జరుగనున్న హీరో ఇంటర్ కాంటినెంటల్ కప్ నేపథ్యంలో క్రీడాకారులకు శిక్షణ ఇవ్వడమే ఈ పిలుపునకు కారణమని తెలుస్తోంది. మే 16లోపు క్రీడాకారులు క్యాంప్‌కు రావాలని స్టీఫెన్‌సన్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు.

Pages