S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

04/27/2018 - 01:10

హైదరాబాద్, ఏప్రిల్ 26: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో గురువారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ బౌలర్ అంకిత్ రాజ్‌పుఠ్ తన అద్భుత బౌలింగ్‌తో ప్రత్యర్థి వెన్నువిరిచాడు. అతని బౌలింగ్ ధాటికి హైదరాబాద్ ఆటగాళ్లు పరుగులు చేయడానికి ఆపసోపాలు పడాల్సి వచ్చింది. దీంతో ఈ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. తొలుత టాస్ గెలిచిన పంజాబ్ బౌలింగ్‌ను ఎంచుకుంది.

04/27/2018 - 01:11

న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: వరుస ఓటములతో ఢిల్లీ జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి గౌతం గంభీర్ తప్పుకున్న నేపథ్యంలో కొత్త కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన యువ క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్ నాయకత్వంలో తొలిసారిగా శుక్రవారం సొంత మైదానంలో కోల్‌కతాతో తలపడనుంది.

04/27/2018 - 00:42

బ్యాంకాక్, ఏప్రిల్ 26: యూత్ ఒలింపిక్స్ కోసం జరుగుతున్న ఆసియా క్వాలిఫయింగ్ ఈవెంట్‌లో భారత పురుషులు, మహిళల జట్లు ప్రత్యర్థులపై విజయం సాధించి సత్తా చాటాయి. మహిళల హాకీ జట్టు అసాధారణ ప్రదర్శనతో హోరెత్తించాయి. పురుషుల జట్టు 6-2 గోల్స్ తేడాతో ప్రత్యర్థి జపాన్‌పై, మహిళల జట్టు 10-0తో దక్షిణ కొరియాపై విజయం సాధించాయి. పూల్-బిలో భారత్ ఆరు పాయింట్లతో టాప్‌లో నిలిచింది.

04/27/2018 - 00:40

ఉహాన్ (చైనా), ఏప్రిల్ 26: కామనె్వల్త్ గేమ్స్ గోల్డ్ మెడలిస్టు సైనా నెహ్వాల్, ఒలింపిక్ సిల్వర్ మెడలిస్టు పీవీ సింధు ఇక్కడ జరుగుతున్న ఆసియా బాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్స్‌లోకి ప్రవేశించారు. చైనా షట్లర్ గావో ఫంగ్జీని 40 నిమిషాలపాటు జరిగిన పోటీలో 21-18, 21-8 తేడాతో ఓడించిన సైనా అద్భుత ఆటతీరును కనబరించింది.

04/26/2018 - 12:51

చెన్నై: టీమిండియా మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ ఇప్పటివరకూ ఎవరికీ సాధ్యం కాని రికార్డును సొంతం చేసుకున్నాడు. టీ20ల్లో కెప్టెన్‌గా 5 వేల రన్స్ చేసిన తొలి బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఆర్సీబీతో మ్యాచ్‌లో 70 రన్స్ చేసి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిన మహి.. ఈ రికార్డును తనపేరిట రాసుకున్నాడు. ధోనీ కేవలం 34 బంతుల్లోనే 70 పరుగులు చేశాడు.

04/26/2018 - 13:37

ముంబయి: పరుగుల రారాజు విరాట్ కోహ్లీ పేరును రాజీవ్ గాంధీ ఖేల్త్న్ర అవార్డుకు సిపారుసు చేసినట్లు బీసీసీఐ సీఓఏ చీఫ్ వినోద్‌రాయ్ వెల్లడించారు. ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ సునీల్ గవాస్కర్ పేరును ధ్యాన్‌చంద్ అవార్డుకు ఎంపికిచేసినట్లు ఆయన తెలిపారు. ఖేల్త్న్ర అవార్డు కోసం బీసీసీఐ కోహ్లీ పేరును పంపడం ఇది రెండవసారి.

04/26/2018 - 04:48

న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ ఆటగాడు, ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్, మహిళా క్రికెటర్ స్మృతి మంధానకు అర్జున అవార్డులు ఇవ్వాలని బీసీసీఐ బుధవారం సిఫార్సు చేసింది. అర్జున అవార్డుల కోసం ఈ ఇద్దరి పేర్లను ప్రతిపాదించినట్టు బీసీసీఐ యాక్టింగ్ సెక్రెటరీ అమితాబ్ చౌదరి తెలిపాడు.

04/26/2018 - 01:45

కోల్‌కతా, ఏప్రిల్ 25: ఢిల్లీ డేర్ డెవిల్స్ మాజీ కెప్టెన్ గౌతం గంభీర్ తన జీతం మొత్తం 2.8 కోట్ల రూపాయలను వదులుకోనున్నాడా? ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో ఢిల్లీ కెప్టెన్‌గా సమర్ధవంతంగా జట్టును నడపలేకపోవడంతోపాటు వైఫల్యాలకు నైతిక బాధ్యతగా అతను కెప్టెన్సీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

04/26/2018 - 01:44

న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: ఢిల్లీ డేర్ డెవిల్స్ కెప్టెన్ గౌతం గంభీర్ కెప్టెన్సీ బాధ్యతల నుండి తప్పుకున్నాడు. కొత్త కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్‌ను ఫ్రాంచైజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) హేమంత్ దువా, కోచ్ రికీ పాంటింగ్ బుధవారం ఇక్కడ జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. 36 ఏళ్ల గంభీర్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నా జట్టు ఆడబోయే మిగిలిన ఎనిమిది మ్యాచ్‌లలోనూ ప్రాతినిధ్యం వహిస్తాడు.

04/26/2018 - 01:42

బెంగళూరు, ఏప్రిల్ 25: బెంగళూరు జట్టు క్రికెటర్ ఏబీ డివిలియర్స్ మళ్లీ జూలు విదిల్చాడు. ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో 90 పరుగులు చేసి జట్టును గెలిపించిన బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. బుధవారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డివిలియర్స్ సరైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో అతను జట్టులో అత్యధికంగా 68 పరుగులు చేశాడు.

Pages