-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: మహిళల జట్టును మరింత పటిష్టం చేసేందుకు భారత హాకీ సమాఖ్య ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా సీనియర్ మహిళల జాతీయ స్థాయి హాకీ శిక్షణ శిబిరాన్ని ఈనెల 22 నుంచి బెంగళూరులోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) సెంటర్లో నిర్వహించనుంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా 61 మంది క్రీడాకారిణులను ఎంపిక చేసింది. వీరిలో 18 మంది ఇటీవల కామనె్వల్త్ క్రీడల్లో పాల్గొన్న వారు ఉండటం విశేషం.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: రానున్న ఆసియా క్రీడల్లో భారత బాక్సర్లు మరిన్ని పతకాలను మన దేశానికి అందించనున్నారని ప్రముఖ బాక్సర్, గోల్డ్ కోస్ట్లో ఇటీవల జరిగిన కామనె్వల్త్ గేమ్స్లో గోల్డ్ మెడల్ విజేత వికాస్ కృష్ణన్ యాదవ్ అన్నాడు. గోల్డ్ కోస్ట్లో మన దేశం తరఫు6
ముంబయి, ఏప్రిల్ 21: ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో లెగ్ స్పిన్నర్లు అద్భుత ఆటతీరుతో ఆకట్టుకుంటున్నారని భారత క్రికెట్ క్రీడా దిగ్గజం, 1983 ప్రపంచ కప్ సారథ్యం వహించిన కపిల్ దేవ్ అన్నాడు. మన దేశంలో ఐపీఎల్ సీజన్ ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు జరుగుతున్న పలు మ్యాచ్లలో లెగ్ స్పిన్నర్ల ఆటతీరు అద్భుతంగా ఉందని ఆయన ప్రశంసించాడు.
బెంగళూరు, ఏప్రిల్ 21: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో భాగంగా ఇక్కడి చిన్నస్వామి స్టేడియంలో శనివారం నాటి రెండో మ్యాచ్లో దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్మన్ ఏబీ డివిలియర్స్ మళ్లీ ఫాంలోకి రావడంతో ఢిల్లీ డేర్ డెవిల్స్ను ఢీకొన్న రాయల్స్ చాలెంజర్స్ బెంగళూరు ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 175 పరుగుల విజయ లక్ష్యాన్ని ఈ జట్టు ఇంకా రెండు ఓవర్లు మిగిలి ఉండగానే ఛేదించింది.
కోల్తా నైట్ రైడర్స్ ఒ కింగ్స్ ఎలెవెన్ పంజాబ్
కోల్కతా ఈడెన్ గార్డెన్స్ మైదానంలో శనివారం సాయంత్రం 4 గంటల నుంచి
పుణే, ఏప్రిల్ 20: షేన్ వాట్సన్ సెంచరీతో చెలరేగగా, సురేష్ రైనా 46 పరుగులతో అతనికి చక్కటి మద్దతునిచ్చిన నేపథ్యం లో, రాజస్థాన్ రాయల్స్తో శుక్రవారం జరిగిన ఇండియన్ ప్రీమి యర్ లీగ్ (ఐపీఎల్) టీ-20 క్రికెట్ టోర్నమెంట్ గ్రూప్ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత ఓవర్ల లో 5 వికెట్లకు 204 పరుగులు సాధించగలిగింది.
మూడు మిలియన్ డాలర్ల ఖరీదుపై మాంచెస్టర్ యునైటెడ్కు వెళ్లేందుకు సిద్ధమైన జానీ ఇవాన్స్. వెస్ట్ బ్రామ్కు చెందిన ఈ యువ ఆటగాడిని భారీ ధరకు కొనేందుకు యునైటెడ్ క్లబ్ అన్ని లాంఛనాలను పూర్తి చేసిందని సమాచారం. అయితే, అటు క్లబ్ నుంచిగానీ, ఇటు ఆటగాడి నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
కాలికి శస్తచ్రికిత్స చేయించుకొని, విశ్రాంతి తీసుకుంటున్న బ్రెజిల్ సాకర్ సూపర్ స్టార్ నేమార్ తన గర్ల్ ఫ్రెండ్ బ్రూనా మార్వెజిన్తో కలిసి రియో డిజెనీరోలో షాపింగ్కు రావడం హాట్ టాపిక్గా మారింది. రష్యాలో జరిగే ప్రపంచ కప్ చాంపియన్షిప్లో నేమార్ ఆడడం అనుమానంగానే ఉందన్న వార్తలు వెలువడిన నేపథ్యంలో, అతను షాపింగ్కు రావడం చర్చనీయాంశమైంది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డుకు టేబుల్ టెన్నిస్ స్టార్ మానికా బాత్రా పేరును అఖిల భారత టేబుల్ టెన్నిస్ సమాఖ్య (టీటీఎఫ్ఐ) ప్రతిపాదించింది. ఇటీవల గోల్డ్ కోస్ట్లో జరిగిన కామనె్వల్త్ గేమ్స్లో 22 ఏళ్ల మానికనాలుగు పతకాలను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. రియో ఒలింపిక్ చాంపియన్ ఫెంగ్ తియాన్వెయ్ని ఆమె రెండు సార్లు ఓడించి సంచలనం సృష్టించింది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: వరల్డ్ కప్ టెన్నిస్ చాంపియన్షిప్ను ప్రవేశపెట్టాలన్న అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) నిర్ణయం సరైనదేనని, అయితే, కేవలం వారం రోజుల్లోనే దీనిని ముగించాలని నిర్ణయించడంలో ఏమాత్రం ఔచిత్యం లేదని భారత డేవిస్ కప్ మాజీ కెప్టెన్ ఆనంద్ అమృత్రాజ్ విమర్శించాడు.