S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

04/21/2018 - 00:24

న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: ముంబయిలో వచ్చేనెల ఒకటి నుంచి పదో తేదీ వరకు హీరో ఇంటర్‌కాంటినెంటల్ కప్ సాకర్ చాంపియన్‌షిప్ జరగనుంది. భారత్‌సహా నాలుగు దేశాలు పోటీపడే ఈ హీరో కప్‌లో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, చైనీస్ తైపీ కూడా టైటిల్ కోసం పోరాటం సాగించనున్నాయి. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ దేశాలు ఈ టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి ఆసక్తి ప్రదర్శించాయి.

04/21/2018 - 00:23

సిడ్నీ, ఏప్రిల్ 20: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు చీఫ్ కోచ్ ఎంపిక త్వరలో జరగనుంది. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) పాలక మండలి శుక్రవారం ప్రకటించింది. నిజానికి వివిధ అంశాలను చర్చించి, తగిన నిర్ణయాలు తీసుకోవడానికి సమావేశమైన సీఏ కోచ్ ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తుందని అంతా అనుకున్నారు.

04/21/2018 - 00:22

ముంబయి, ఏప్రిల్ 20: తాను కెరీర్‌ను కొనసాగిస్తునే ఉన్నానని, ప్రస్థానం ఎక్కడా ఆగలేదని భారత ఏస్ షూటర్ తేజశ్విని సావంత్ స్పష్టం చేసింది. కొంతకాలం విరామం తర్వాత, ఇటీవల జరిగిన కామనె్వల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకాన్ని సాధించడమేగాక, కొత్త గేమ్స్ రికార్డును కూడా నెలకొల్పిన తేజశ్విని రెండో ఇన్నింగ్స్ గొప్పగా ప్రారంభమైందని మీడియాలో వార్తలు వచ్చాయి.

04/21/2018 - 00:20

లండన్ శివార్లలోని సెల్‌హర్ట్ ప్రాంతంలో సర్వాంగ సుందరంగా ముస్తాబైన క్రిస్టల్ ప్యాలెస్ స్టేడియం. సుమారు 100 మిలియన్ పౌండ్లు వెచ్చించి దీనిని ఆధునీకరించారు. అంతేగాక సీటింగ్ కెపాసిటీని 26,000 నుంచి 34,000కు పెంచారు. అన్ని విధాలా స్టేడియం సిద్ధంగా ఉందని, ఈ మైదానంలో మ్యాచ్‌లను నిర్వహించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని క్రిస్టల్ ప్యాలెస్ క్లబ్ అధికారులు ప్రకటించారు.

04/21/2018 - 00:19

మాంటే కార్లో, ఏప్రిల్ 20: ప్రపంచ మాజీ నంబర్ వన్ రాఫెల్ నాదల్ ఇక్కడ జరుగుతున్న మాంటే కార్లో మాస్టర్స్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్‌లో సెమీస్ చేరాడు. గాయాల కారణంగా పలుమార్లు కెరీర్‌కు అంతరాయం ఏర్పడుతున్న తరుణంలో అతను మళ్లీ ఫామ్‌లోకి రావడం విశేషం. క్వార్టర్ ఫైనల్‌లో డామినిక్ థియేమ్‌ను 6-0, 6-2 తేడాతో చిత్తుచేసిన విధానం నాదల్ ప్రతిభకు నిదర్శనం.

04/20/2018 - 02:45

హోబర్ట్: ఆస్ట్రేలియా క్రికెట్‌కు కొత్త రూపురేఖలను తెచ్చేందుకు ప్రయత్నిస్తానని, అభిమానుల విశ్వాసాన్ని మళ్లీ సంపాదించుకునేందుకు కృషి చేస్తానని ఆ జట్టు కొత్త కెప్టెన్ టిమ్ పైన్ స్పష్టం చేశాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా జరిగిన మూడో టెస్టులో చోటు చేసుకున్న బాల్ ట్యాంపరింగ్ ఉదంతం యావత్ క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన విషయం తెలిసిందే.

04/20/2018 - 01:11

కోయంబత్తూర్, ఏప్రిల్ 19: తమిళనాడు అథ్లెటిక్ సంఘం ఆధ్వర్యంలో 16వ ఫెడరేషన్ కప్ జూనియర్ జాతీయ అథ్లెటిక్ చాంపియన్‌షిప్ ఈనెల 20 నుంచి 22 వరకు నిర్వహించనున్నారు. మూడు రోజుల పాటు జరుగనున్న ఈ చాంపియన్‌షిప్‌లో మొత్తం 32 రాష్ట్రాలకు చెందిన 800 అథ్లెటిక్ క్రీడాకారులు పాల్గొననున్నారు.

04/20/2018 - 01:11

విజయవాడ, ఏప్రిల్ 19 ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కిడాంబి శ్రీకాంత్ ప్రపంచ బ్యాడ్మింటన్ నెంబర్ వన్ క్రీడాకారుడుగా రాణిస్తూ రెవెన్యూ శాఖలో డెప్యూటీ కలెక్టర్‌గా ఉండటం గర్వించదగిన విషయమని రాష్ట్ర భూ పరిపాలనశాఖ చీఫ్ కమిషనర్ (సీసీఎల్‌ఏ) అనీల్ చంద్ర పునేఠ పేర్కొన్నారు. గురువారం విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి గ్రామంలోని సీసీఎల్‌ఏ కార్యాలయంలో కిడాంబి శ్రీకాంత్, గురువారం నియామకపు ఉత్తర్వులు అందుకున్నారు.

04/20/2018 - 01:09

మాంటేకార్లో, ఏప్రిల్ 19: ఇక్కడ జరుగుతున్న మాంటేకార్లో టెన్నిస్ టోర్నమెంట్‌లో మూడో రౌండ్‌లోనే ప్రపంచ మాజీ నంబర్ వన్ నొవాక్ జొకోవిచ్ పరాజయాన్ని ఎదు ర్కొని నిష్క్రమించాడు. డామినిక్ థియేమ్ 6-7, 2-6, 3-6 తేడాతో జొకోవిచ్‌పై సంచలన విజయాన్ని నమోదు చేశాడు. మొదటి సెట్‌ను కైవసం చేసుకున్న జొకోవిచ్ అదే స్థాయలో రాణించలేక, మిగతా రెండు సెట్లను పేలవంగా ఆడి, కోల్పోవ డం గమనార్హం.

04/20/2018 - 01:07

న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్‌లో ఇటీవల జరిగిన కామనె్వల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించిన జావెలిన్‌త్రోయర్ నీరజ్ చోప్రా వచ్చేనెల 4 నుంచి దోహాలో జరుగునున్న డైమండ్ లీగ్ సిరీస్ మొదటి దశలో పతకంపై కనే్నశాడు.

Pages