S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

04/06/2018 - 23:31

ముంబయి, ఏప్రిల్ 6: ఐపీఎల్ చాంపియన్లు ముంబయి ఇండియన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ ఢీ కోంటుంది. రెండేళ్ల నిషేధం తరువాత బరీలోకి దిగుతున్న చెన్నై సూపర్ కింగ్స్, నిరూటి విజేత ముంబయి ఇండియన్స్ జట్లు ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌లో తలపడనున్నాయి. జట్టులో లెక్కకు మించి స్టార్ ఆటగాళ్లు.. మ్యాచ్‌ఫలితాన్ని మార్చేసే మేటి హీరోలు, సమిష్టి ఆటతీరును ప్రదర్శించేందుకు రెండు జట్లు సిద్దమయ్యాయి.

04/06/2018 - 23:28

గోల్ట్ కోస్ట్, ఏప్రిల్ 6: కామనె్వల్త్ గేమ్స్‌లో అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న భారత్, పాకిస్తాన్ పురుషుల హాకీ మ్యాచ్ శనివారం జరగనుంది. చిరకాల ప్రత్యర్థులైన ఈ రెండు దేశాల మధ్య రాజకీయపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతునే ఉన్నాయి. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ, భారత్‌ను అస్థిరపరిచే ప్రయత్నాలు చేస్తున్న పాకిస్తాన్‌తో భారత్ ద్వైపాక్షిక క్రీడా సంబంధాలను తెంచేసుకున్న విషయం తెలిసిందే.

04/06/2018 - 15:54

న్యూఢిల్లీ: మహిళా క్రికెట్ లో అనితర సాధ్యమైన రికార్డును భారత మహిళల క్రికెట్‌ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్‌ నెలకొల్పింది. అంతర్జాతీయ మహిళా క్రికెట్లో అత్యధిక వన్డేలు ఆడిన క్రీడాకారిణిగా మిథాలీ రాజ్‌ చరిత్ర సృష్టించింది. ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌ చార్లెట్‌ ఎడ్వర్ట్స్‌ (191) పేరిట ఉన్న రికార్డును నాగ్ పూర్ వేదికగా భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య ప్రారంభమైన తొలి వన్డేతో మిథాలీ రాజ్ (192) అధిగమించింది.

04/06/2018 - 03:28

గోల్డ్ కోస్ట్ (ఆస్ట్రేలియా)లో జరుగుతున్న కామనె్వల్త్ గేమ్స్ మహిళల 48 కిలోల వెయిట్‌లిఫ్టింగ్ ఈవెంట్‌లో స్వర్ణ పతకం సాధించిన భారత లిఫ్టర్ సయ్‌ఖోమ్ మీరాబాయి చాను. ఈ క్రమంలో ఆమె రెండు మీట్ రికార్డులను నెలకొల్పింది. అంతకు ముందు పురుషుల 56 కిలోల విభాగంలో గరురాజా పుజారీ రజతాన్ని సాధించి భారత్ పతకాల పట్టికను తెరిచాడు.

04/06/2018 - 00:15

‘కామనె్వల్త్ గేమ్స్‌లో రికార్డులు సృష్టిస్తానని మొదట అనుకోలేదు. కానీ, ఇక్కడికి వచ్చిన తర్వాత, స్వర్ణం ఖాయమని, రికార్డులు సాధించే అవకాశాలు కూడా ఉన్నాయని అభిప్రాయపడ్డాను. సరికొత్త రికార్డుతో స్వర్ణ పతకాన్ని గెల్చుకోవడంలో ఉన్న ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. ఈ క్షణం కోసం ఎంతో కష్టపడ్డాను. కామనె్వల్త్ గేమ్స్‌లో ఇది నాకు రెండో పతకం. నా తదుపరి లక్ష్యం ఆసియా క్రీడలు.

04/06/2018 - 00:13

గోల్డ్ కోస్ట్: బాడ్మింటన్‌లో పతకాలు సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రత్యర్థులకు భారత్ హెచ్చరికలు పంపింది. గురువారం జరిగిన మిక్స్‌డ్ టీం ఈవెంట్‌లో భాగంగా శ్రీలంకను 5-0 తేడాతో చిత్తుచేసింది. ఆతర్వాత చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను కూడా అదే తేడాతో మట్టికరిపించింది.

04/06/2018 - 00:11

‘కామనె్వల్త్ గేమ్స్‌లో పతకం సాధించడం ఎంతో ఆనందంగా ఉంది. 2020లో టోక్యో ఒలింపిక్స్‌కు సిద్దం అవుతాను. నేషనల్ ఫెడరేషన్ నుంచి నాకు ఎంతో మద్దతు లభించింది. నా కోసం ఎంతో మంది కోచ్‌లు శ్రమించారు. వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. 2010 కామనె్వల్త్ క్రీడల్లో సుశీల్ కుమార్ రెజ్లింగ్ బౌట్స్ చూశాను. దాదాపు అదే సమయంలో నేను వెయిట్‌లిఫ్టింగ్ ఫ్రాక్టీస్ మొదలుపెట్టాను.

04/06/2018 - 00:08

మెల్‌బోర్న్, ఏప్రిల్ 5: బాల్ ట్యాంపరింగ్ ఉదంతానికి బాధ్యులైన ముగ్గురు ఆస్ట్రేలియా ఆటగాళ్లు తమపై పడిన నిషేధాన్ని సవాలు చేయకూడదని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే స్మిత్, బాన్‌క్రాప్ట్ సవాలు చేయకూడదని నిర్ణయించుకున్నారు. వీరి బాటలోనే డేవిడ్ వార్నర్ కూడా నిషేధంపై సవాలు చేయకూడదని నిర్ణయించుకున్నట్లు వెల్లడించాడు. టాంపరింగ్ వ్యూహకర్తలుగా భావిస్తున్న స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లపై ఏడాది..

04/06/2018 - 00:06

ముంబయి, ఏప్రిల్ 5: ఐపీఎల్‌లో ఇప్పటికే మూడుసార్లు విన్నర్లుగా, డిఫెండింగ్ ఛాంపియన్లుగా అవతరించిన తాము శనివారం నుంచి జరిగే ఐపీఎల్ 11వ ఎడిషనల్‌లో ఫేవరిట్‌గా ఉంటామని భావించడం లేదని ముంబయి ఇండియన్ జట్టు కోచ్ మహేల జయవర్ధనే అన్నాడు.

04/06/2018 - 00:05

ముంబయి, ఏప్రిల్ 5: టీవీ మాధ్యమాల్లో దిగ్గజమైన స్టార్ ఇండియా దాదాపు ఒక బిలియన్ డాలర్ల వ్యయంతో భారత క్రికెట్ మీడియా హక్కులను దక్కించుకుంది. స్వదేశంలో వచ్చే ఐదేళ్ల వరకు అంటే 2023 సంవత్సరం వరకు నిర్వహించే అన్ని సిరీస్‌లను ప్రసారం చేసేందుకు వీలుగా గ్లోబల్ కన్‌సాలిడేటెడ్ రైట్స్ (జీసీఆర్)ను 6138.1 కోట్లు (దాదాపు 944 డాలర్లు)తో దక్కించుకుంది.

Pages